అప్రమత్తతకు సాంకేతిక దన్ను
అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.
దామిని యాప్
కొత్తకోట గ్రామీణం, న్యూస్టుడే : అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రైతులను, ప్రజలను అప్రమత్తం చేసి వారికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర వాతావరణ శాఖ ప్రత్యేక యాప్లను రూపొందించింది. వీటిని చరవాణుల్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ఎక్కడ పిడుగు పడుతుంది? ఏ సమయంలో వర్షం కురుస్తుందనే విషయాలను భారత వాతావరణ ఖాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా రాబోయే అయిదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి మూడు యాప్లను వేర్వేరుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి యాప్నకు వినియోగదారుడి పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సరైన సమాచారం అందుతుంది.
రెయిన్ అలారం..: స్మార్ట్ఫోన్లో గూగుల్ప్లే స్టోర్ నుంచి రెయిన్ అలారం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైతులు పంటలు పండించి నూర్పిళ్లు చేసి ధాన్యం ఇంటికి చేర్చే వరకు కంటి మీద కునుకు లేకుండా గడుపుతారు. ధాన్యం సిద్ధం చేసుకున్న తర్వాత అకాల వర్షం వల్ల తడిచిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. రెయిన్ అలారం యాప్ ద్వారా వినియోగదారుడు అందించిన వివరాల మేరకు సుమారు 20 కి.మీ.దూరంలో ఎక్కడ వర్షం కురిసే సూచనలున్నాయనే సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. రైతులు ముందే జాగ్రత్త పడొచ్చు.
దామిని..: ఏప్రిల్, మే నెలలో ఈదురు గాలులు వీచి అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొలాల వద్దకు వెళ్లిన రైతులు, ప్రయాణాల్లో ఉన్న వారు వర్షం ప్రారంభం కాగానే చెట్ల కిందకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందకు వెళ్లడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. దామిని యాప్ ద్వారా 5 నుంచి 20 నిమిషాల్లోపు 20 కి.మీ. పరిధిలో ఎక్కడ పిడుగు పడుతుందో క్షణాల్లో సమాచారం అందుతుంది. రైతులు, ప్రజలు అప్రమత్తమై ప్రాణాలను రక్షించుకోవచ్చు.
మేఘదూత్ యాప్
మేఘదూత్: పంటలకు రైతులు రసాయన ఎరువులు పిచికారీ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పిచికారీ చేసి ఇంటికి వచ్చే సరికే వర్షం కురిసి మందులు వృథా అవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే వాతావరణ శాఖ మేఘదూత్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు అందిస్తుంది. రాబోయే అయిదు రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచన, ఆకాశం మేఘావృతం, అవుతుందా? ఈదురు గాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ దిశగా వీస్తాయనే సమాచారాన్ని అందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి