సమాజాన్ని నిలబెట్టేది పుస్తకాలే
‘సమాజంలో విలువలు పడిపోతున్న, కుటుంబ సంబంధాలు పలచనవుతున్న కాలంలో పుస్తకం అనే పనిముట్టుతో వాటిని నిలబెట్టాలనేదే హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రధాన లక్ష్యం’ అని నూతన అధ్యక్షుడు కవి యాకుబ్ తెలిపారు.
‘ఈనాడు’తో హైదరాబాద్ బుక్ ఫెయిర్ నూతన అధ్యక్షుడు కవి యాకూబ్
ఈనాడు, హైదరాబాద్
‘సమాజంలో విలువలు పడిపోతున్న, కుటుంబ సంబంధాలు పలచనవుతున్న కాలంలో పుస్తకం అనే పనిముట్టుతో వాటిని నిలబెట్టాలనేదే హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రధాన లక్ష్యం’ అని నూతన అధ్యక్షుడు కవి యాకుబ్ తెలిపారు. సిటీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా మూడు దశాబ్దాలు బోధన చేసిన ఆయన 2020లో పదవీ విరమణ చేశారు. 12ఏళ్లుగా ఫేస్బుక్లో కవి సంగమం పేరుతో అక్షరయజ్ఞం చేస్తున్నారు. తెలుగులో కవిత్వం రాస్తూ..యువ రచయితలను ప్రోత్సహిస్తున్నారు. ప్రచురణకర్త అయిన ఆయన సొసైటీకి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ‘ఈనాడు’తో మాట్లాడారు.
36 ఏళ్ల కిందట చిన్నగా మొదలై..
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ 36 ఏళ్ల కిందట చిన్నగా మొదలైంది. ప్రచురణ కర్తలు, పుస్తకవిక్రేతలు ఏర్పాటు చేసుకున్న సొసైటీ ఇది. క్రమంగా పెరిగింది. పుస్తకాలను పాఠకుల చెంతకు చేర్చడం, సమాజాన్ని పుస్తకాల వైపు మళ్లించే లక్ష్యంగా సొసైటీ పనిచేస్తోంది. ఇందుకు పుస్తక ప్రదర్శనలో వేర్వేరు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
జిల్లాలకు విస్తరించేలా ప్రణాళికలు
నగరానికే పరిమితం కాకుండా జిల్లాలకు పుస్తక ప్రదర్శనను విస్తరించాలనే ఆలోచన ఉంది. గతంలోనూ కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో స్థానిక ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోనే కాదు.. ఖమ్మం జిల్లాలో ఓగ్రామంలోనూ ప్రదర్శన ఏర్పాటుచేసిన చరిత్ర ఉంది. గత అధ్యక్షుడు గౌరీశంకర్ విస్తృతంగా కృషి చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం.
దేశంలోనే మంచి పేరుంది
ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని వేర్వేరు నగరాల్లో పుస్తకాల ప్రమోషన్ కోసం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీ, కర్ణాటక, కేరళలో బాగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనలలో ఒకటిగా పేరుంది. ఇక్కడ ఆంగ్లం, తెలుగు, సాహిత్యం, చరిత్ర, శాస్త్ర విజ్ఞానం ఇలా అన్నిరకాల, అన్ని వర్గాలకు కావాల్సిన పుస్తకాలు ప్రదర్సిస్తారు.
అంతర్జాలం సవాళ్లను అధిగమించేలా
అరచేతిలోకి అంతర్జాలం వచ్చాక సమాచార లభ్యత పెరిగింది. చదవడం కంటే చూసి వదిలేయడం పెరిగింది. దీన్నే లుక్ కల్చర్ అంటాను. కానీ పుస్తక పఠనం ద్వారా కలిగే ఆనందం వేరు. సమాజాన్ని పఠనం వైపు మళ్లించగలిగితే చాలా మేలు జరుగుతుంది.
అచ్చుకు ఆదరణ ఎలా?
డిజిటల్ యుగంలోనూ అచ్చు పుస్తకాలు కొనడం, చదవడం మరీ తగ్గలేదు, పెరగలేదు. జిల్లా గ్రంథాలయాల సొసైటీతో కలిసి అక్కడ కొత్త పుస్తకాలు దొరికేలా ప్రజల్లో అవగాహన పెంచేలా అధికారులతో సంయుక్త కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు గ్రంథాలయ ఛైర్మన్ను కలవనున్నాం.
తెలుగు భాష వ్యాప్తికి
యువ రచయితలు ఎంతోమంది తెలుగు రచనలు చేస్తున్నారు. మరింత మందిని రచనల వైపు, పఠనం వైపు మళ్లించాలి. ఇందులో హైదరాబాద్ బుక్ ఫెయిర్ పాత్ర ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన.
వేసవిలో వచ్చే ఏడాది నుంచి పిల్లల కోసం
పుస్తక ప్రదర్శన సమయంలోనే కొన్నేళ్లుగా పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిత్రలేఖనం, కవితలు, కథలు రాయడం వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. వేసవిలోనే పిల్లలకు సెలవుల సమయంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ తరఫున బుక్ ఎగ్జిబిషన్ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఈసారి సమయం దాటిపోయింది. వచ్చే ఏడాది నుంచి ఏర్పాటుకు కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి