Half Day Schools: తెలంగాణలో 15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 07 Mar 2024 17:29 IST

హైదరాబాద్‌: వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పది పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు