Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఫైబర్‌ నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ  వాయిదా పడింది.

Updated : 30 Nov 2023 16:03 IST

దిల్లీ: ఫైబర్‌ నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ  వాయిదా పడింది.  చంద్రబాబు పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం .. తదుపరి విచారణను డిసెంబరు 12తేదీకి వాయిదా వేసింది. గత నెల 13, 17, 20, నవంబరు 9 తేదీల్లో ఇదే పిటిషన్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో అందులో తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తులు గత విచారణ సమయంలో స్పష్టం చేశారు. 17ఏ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారిస్తామని ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని తెలిపింది. 17ఏ అంశంపై తీర్పు ప్రాసెస్‌లో ఉందని జస్టిస్‌ అనిరుద్దబోస్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు