Kollu Ravindra: కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మద్యం కేసులో మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర  దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.  విచారణను ఈ నెల 16కు వాయిదా వేసినట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. 

Published : 15 Nov 2023 12:51 IST

అమరావతి: మద్యం కేసులో మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర  దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.  విచారణను ఈ నెల 16కు వాయిదా వేసినట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. 

గత ప్రభుత్వ హయంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో.. సీఐడీ అధికారులు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. కొల్లు రవీంద్ర బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దురుద్దేశపూర్వకంగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు