Medaram: మేడారానికి సమ్మక్క.. ప్రణమిల్లిన భక్తకోటి

మేడారం మహా జాతర (Medaram Maha Jatara)లో రెండో రోజు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

Published : 22 Feb 2024 22:14 IST

ములుగు: మేడారం మహా జాతర (Medaram Maha Jatara)లో రెండో రోజు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క వచ్చేసింది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో అమ్మవారిని పూజారులు గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అంతకుముందు చిలకలగుట్ట వద్ద జిల్లా ఎస్పీ శబరీష్‌ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు. అమ్మవారి రాక నేపథ్యంలో ‘జై సమ్మక్క’ అంటూ మేడారం పరిసరాలు మార్మోగాయి. వనదేవతకు స్వాగతం పలుకుతూ భక్తులు దారి పొడువునా ముగ్గులు వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని