Lasya Nanditha: అశ్రునయనాల మధ్య ముగిసిన లాస్య నందిత అంత్యక్రియలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి.

Published : 23 Feb 2024 19:39 IST

సికింద్రాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు పాడె మోశారు. లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, భారాస అధినేత కేసీఆర్‌ నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని