MLC kavitha: భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది.

Published : 09 Apr 2024 12:10 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వాదనలు వినిపించింది. జ్యుడిషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతినివ్వడంతో.. వారు కవితను కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని