Andhra news: రామోజీరావు అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్‌ అధికారులు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్‌ అధికారులు హాజరు కానున్నారు.

Published : 08 Jun 2024 20:29 IST

అమరావతి: రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్‌ అధికారులు హాజరు కానున్నారు. ఆదివారం నిర్వహించనున్న అంత్యక్రియల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఆర్పీ సిసోదియా, సాయిప్రసాద్‌, రజత్‌ భార్గవ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పార్థివదేహంపై అధికారులు పుష్పగుచ్ఛం సమర్పించి నివాళి అర్పించనున్నారు.

రామోజీరావు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని