పాతకాలం మొబైళ్లు ఒక్కచోట చేరితే..!
స్మార్ట్ యుగంలో ఇప్పుడంతా స్మార్ట్ఫోన్లదే హవా. టచ్ స్క్రీన్, స్మార్ట్ కీబోర్డు.. లాక్, 2ఎంపీ నుంచి 60 ఎంపీ కెమెరాలు, అన్ని సమకూర్చే యాప్లు ఇలా అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది. కానీ, ఇవేవీ లేని ఒకప్పటి మొబైళ్లు మీకు గుర్తున్నాయా? నోకియా 1100, 6620, 5300, 3310, సోనీ ఎరిక్సన్ డబ్యూ910, శాంసంగ్
వెయ్యికిపైగా మొబైళ్లు సేకరించిన టర్కీవాసి
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ యుగంలో ఇప్పుడంతా స్మార్ట్ఫోన్లదే హవా. టచ్ స్క్రీన్, స్మార్ట్ కీబోర్డు.. లాక్, 2ఎంపీ నుంచి 60 ఎంపీ కెమెరాలు, అన్ని సమకూర్చే యాప్లు ఇలా అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది. కానీ, ఇవేవీ లేని ఒకప్పటి మొబైళ్లు మీకు గుర్తున్నాయా? నోకియా 1100, 6620, 5300, 3310, సోనీ ఎరిక్సన్ డబ్యూ910, శాంసంగ్ ఎస్729ఐ, మోటోరోలా రేజర్ వీ3 ఇలా అనేక బ్రాండ్ల మోడళ్లు ఒకప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవి. అప్పటి మొబైళ్లలో నంబర్ల కీబోర్డు, చిన్నసైజు తెర ఉండేది, కాల్స్, మెసెజ్లు చేయడానికి, పాటలు వినడానికే ఉపయోగపడేవి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. ఈ మొబైల్ ఫోన్లు రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. దీంతో ఆ ఫోన్లు ఔట్డేటెడ్ అయ్యాయి. ఇప్పటి పిల్లలకు ఆ ఫోన్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మరి ఆ పాతకాలం మొబైళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో, ఏమైపోయాయో ఎవరికీ తెలియదు.. పట్టించుకోరు. కానీ, ఓ వ్యక్తి స్మార్ట్ఫోన్కు ముందు వినియోగంలో ఉన్న వందలాది మొబైళ్లను సేకరించి దగ్గర పెట్టుకున్నాడు. ఇటీవల ఆ ఫోన్లను ప్రదర్శించి వార్తల్లో నిలిచాడు.
టర్కీకి చెందిన సహబెట్టిన్ ఓజ్సెలిక్ సెల్ఫోన్ మెకానిక్. 20ఏళ్ల కిందటే సెల్ఫోన్ రిపేర్ షాపు పెట్టుకొని, అన్ని రకాల మొబైళ్ల మోడల్స్ను సేకరించడం మొదలుపెట్టాడు. ‘‘సెల్ఫోన్లపై ఉన్న ఆసక్తితో వాటిని సేకరించడం ప్రారంభించాను. ఏదో ఒక రోజు ఇవన్నీ ఔట్డేటెడ్ అయిపోతాయని, తయారీ ఆగిపోతుందని తెలుసు. అప్పుడు ఇవి అరుదైనవి, ఆమూల్యమైనవిగా మిగులుతాయని భావించే సేకరించా’’అని చెప్పుకొచ్చాడు. సహబెట్టిన్ వద్ద నోకియా, శాంసంగ్, మోటొరోలా ఇలా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన అనేక రకాల మొబైళ్లు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇది వరకు 2వేల వరకు ఉండేవట. రెండేళ్ల కిందట అతడి ఇంట్లో దొంగలు పడి దాదాపు 700 ఫోన్లు ఎత్తుకుపోయారు. దీంతో ప్రస్తుతం 1300 మొబైళ్ల దాకా ఉన్నాయి. అన్ని మొబైళ్లు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. అరుదైన ఫోన్లు కూడా అతడి వద్ద ఉండటంతో చాలా మంది తమకు విక్రయించమని అడుగుతున్నారట. ఎంత డబ్బయినా ఇస్తామని చెబుతున్నారట. కానీ, వాటిని విక్రయించేందుకు సహబెట్టిన్ ఇష్టపడట్లేదు. ఎంత డబ్బు ఇచ్చినా వాటిని అమ్మేది లేదని తేల్చి చెబుతున్నాడు. ఈ మొబైళ్లను సేకరించడం పట్ల గర్వంగా ఉంటుందని, వీటిని ఎప్పటికీ తన వద్దే పెట్టుకొని కండిషన్లో ఉండేలా చూసుకుంటానని అంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్