Nellore: పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.

Published : 02 Jun 2024 13:42 IST

నెల్లూరు: సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు జైలు నుంచి అతడిని విడుదల చేశారు. మీడియా ముందు సతీశ్‌ కంటతడి పెట్టుకున్నాడు. గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్‌తో భయపెట్టారని తెలిపాడు. అనంతరం న్యాయవాది, కుటుంబ సభ్యులతో విజయవాడ బయల్దేరాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని