Vande Bharat express: సికింద్రాబాద్ టు విశాఖ.. మరో ‘వందే భారత్’.. పట్టాలపైకి ఎప్పుడంటే?
సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య మరో వందే భారత్రైలు అందుబాటులోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది.
Vande Bharat express | హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat express) పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలు (నం.20707/20708) మార్చి 12న ప్రారంభం కానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులందించనుంది. రెగ్యులర్ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. బుకింగ్లు మార్చి 12 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. (Secunderabad- Visakhapatnam Vande bharat express)
సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ రైలు (20707) ఉదయం 5.05గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మధ్యాహ్నం 1.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరిన (20708) రాత్రి 11.20గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది. 530 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడిచే ఈ రైలులో ఏడు ఛైర్కార్ కోచ్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ ఉన్నాయి.
ఏ స్టేషన్కు ఎన్నిగంటలకు?
విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ (20833/20834)ను 2023 జనవరి 15న సంక్రాంతి రోజు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ ఉండటం, వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రిజర్వేషన్ దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. రానుపోను ఒక్కటే రైలు ఉండటంతో సాంకేతికంగానూ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మరో రైలు ఏర్పాటుతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. తొలి రైలు 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్త రైలు ఎనిమిది బోగీలతో పట్టాలెక్కనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్