CM Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ (CM Jagan) ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Published : 07 Dec 2023 12:28 IST

ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ (CM Jagan) ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.. విజయవాడ కనకదుర్గానగర్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలైవన్‌, కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు తదితరులు సీఎం జగన్‌కు... ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు