Sunitha: అవినాష్.. మీ ఫోన్ దర్యాప్తు అధికారికి ఇవ్వండి: వైఎస్ సునీత
వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని సునీత అన్నారు.
కడప: వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. పోలీసులతోగానీ, సీబీఐతోగానీ ఈ విషయంపై ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చేస్తారా? అని మండిపడ్డారు. రాజకీయాలే కాకుండా ప్రతి ఒక్కరికీ జీవితం కూడా ఉంటుందని గుర్తించాలని హితవు పలికారు.
‘‘తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నామని అవినాష్ అంటున్నారు. వివేకా కుటుంబం గురించి ఏమైనా ఆలోచించారా?వివేకా హత్యకేసు దర్యాప్తు గురించి పోలీసులతో, సీబీఐతో ఎప్పుడైనా మాట్లాడారా? గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ అని అంటున్నారు. గూగుల్ టేకౌట్ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎల్ తయారు చేశాయి. అవినాష్పై సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎల్కు కూడా కోపం ఉంటుందా? మీ ఫోన్ దర్యాప్తు అధికారికి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.
సాక్షులు చనిపోతున్నారనే కేసును తెలంగాణకు మార్చారు..
గూగుల్ టేకౌట్ ప్రకారం.. అవినాష్ రెడ్డి ఇంట్లో గజ్జెల ఉదయ్కుమార్రెడ్డి ఉన్నారు. వివేకా హత్య ఘటనపై జగన్కు ఏమని సమాచారం ఇచ్చారు. గుండెపోటు అని చెప్పారా? హత్య అని చెప్పారా? హత్య అని తెలిస్తే జగన్ వెంటనే డీజీపీకి ఫోన్ చేయాలి కదా. సిట్లో స్టేట్మెంట్ ఇచ్చానని అవినాష్ చెప్పారు. అర్థం పర్థం లేని స్టేట్మెంట్లు రాసుకున్నారు. అందుకే కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. ఏ స్టేట్మెంట్ అయినా కోర్టులో నిరూపించాలి. సాక్షులు చనిపోతున్నారన్న కారణంతో ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీం కోర్టు మార్చింది. ఘటనాస్థలంలో శివప్రకాష్రెడ్డి లేరు. ఎవరో చెప్పింది చెప్పి ఉండొచ్చు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కాకమ్మ కబుర్లు చెబతున్నారు.
షర్మిలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు..
మీకోసం వివేకా ప్రచారం చేశారన్నారు. అది నిజమే. మీ కోసం అంతగా కష్టపడిన వ్యక్తి కోసం మీరేం చేశారు. అవినాష్ ఎంపీగా.. జగన్ సీఎంగా ఉన్నారు. మాకు న్యాయం చేశారా? వివేకా చేసిన మంచిపనుల గురించి ఈ ఐదేళ్లలో ఒక్కమాట చెప్పారా? మీ కోసం కష్టపడిన వ్యక్తి గురించి ఒక్కసారైనా మీ పత్రికలో రాశారా? పార్టీ కోసం ఎంతో కష్టపడిన షర్మిలకు 2014లో సీటు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు ఏం చేశారని అవినాష్రెడ్డికి సీటు ఇచ్చారు. వివేకా ఆఖరి కోరిక తీర్చే బాధ్యత మీకు లేదా? ఆ అవకాశం అవినాష్కు ఉంది. పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతివ్వండి. కడప జిల్లా ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా హంతకులకు ఓటు వేయొద్దు. మీకోసం పోరాడే వారికి ఓటు వేయండి. మేం సీబీఐని ప్రభావితం చేస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారా? ఐదేళ్లుగా కేసు ముందుకెళ్లడం లేదంటే ఎవరి సత్తా ఏంటో అర్థమవుతోంది. వివేకాను దూరం పెట్టామని విమర్శిస్తున్నారు. నా భర్త, తండ్రి కలిసి కొరియా ట్రిప్ వెళ్లారు. దూరంగా ఉంచితే ఎలా కలిసి ప్రయాణం చేస్తారు?’’ అని సునీత ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?