Tarakaratna: తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు: లక్ష్మీనారాయణ
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తెలుగు సినీనటుడు తారకరత్నకు చికిత్సను కొనసాగుతోంది. పరిస్థితిని బట్టి తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.
బెంగళూరు: బెంగళూరులోని నారాయణ హృదయాలయ(Narayana Hrudayalaya) ఆసుపత్రిలో తెలుగు సినీనటుడు తారకరత్న(Tarakaratna)కు చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం తెదేపా హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ తీశారు. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుంది. పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు’’ అని లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.
నందమూరి తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని హిందూపురానికి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు పూజలు నిర్వహించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోని వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తూ 101 కొబ్బరికాయలు కొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం