Chandrababu: రాష్ట్రంలో మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం: పార్టీ నేతలతో చంద్రబాబు

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును పార్టీ సీనియర్‌ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 29 May 2024 22:24 IST

హైదరాబాద్‌: విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును పార్టీ సీనియర్‌ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. ఎన్నికల తదనంతర పరిణామాలపై గంటన్నరపాటు నేతలు చర్చించారు. ఎలక్షనీరింగ్‌ బాగా చేశాం.. నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు.

‘‘పార్టీ శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తినిచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ఒకే మాటకు కట్టుబడి ఉండి సహకారం అందించారు. భాజపాతో పొత్తు కూడా ఉపయోగపడింది. ఓటమి భయంతో వైకాపా దాడులకు పాల్పడింది. దాడులకు ప్రణాళికలు రచించి.. తెదేపాపై విష ప్రచారం చేశారు. మాచర్ల, తాడిపత్రిలో చేసిన హింస రాష్ట్రమంతా చేయాలని చూశారు. వైకాపా కుట్రలను ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొన్నాం. కౌంటింగ్‌ రోజు అల్లర్లు సృష్టించేందుకు వైకాపా యత్నిస్తోంది. కౌంటింగ్‌ రోజు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వైకాపా ఓటమిని అంగీకరించిందనేందుకు ఇదే ఉదాహరణ. పోలింగ్‌ సరళి చూస్తే వైకాపాకు 35 సీట్లు కూడా వచ్చేటట్లు లేవు’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని