Guntur: సికింద్రాబాద్‌- రేపల్లె ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతికలోపం.. ప్రయాణికుల ఇక్కట్లు

సికింద్రాబాద్‌ నుంచి రేపల్లె బయల్దేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలు గుంటూరు బైపాస్‌ దాటిన తర్వాత నిలిచిపోయింది.

Published : 29 May 2024 21:23 IST

గుంటూరు: సికింద్రాబాద్‌ నుంచి రేపల్లె బయల్దేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలు గుంటూరు బైపాస్‌ దాటిన తర్వాత నిలిచిపోయింది. రైలు నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పాటు నిప్పు రవ్వలు ఎగసిపడటంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. దాదాపు రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ఇదే రైలు రాత్రి 10 గంటలకు రేపల్లె నుంచి సికింద్రాబాద్‌ బయల్దేరాల్సి ఉండటంతో రేపల్లెలో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని