అతడికి కరోనా గురించి తెలియదు!
కరోనా(కొవిడ్-19) వైరస్ గురించి తెలియని వారుండరు. గతేడాదంతా ఇది ప్రపంచాన్ని వణికించింది. కోట్ల మందికి సోకి.. లక్షల మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. కరోనా దెబ్బకు కుటుంబాలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా (కొవిడ్-19) వైరస్ గురించి తెలియని వారుండరు. గతేడాదంతా ఇది ప్రపంచాన్ని వణికించింది. కోట్ల మందికి సోకి.. లక్షల మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. కరోనా దెబ్బకు కుటుంబాలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఏదో ఒక రకంగా కరోనా వల్ల బాధితులుగా మారినవారే. దీంతో ప్రతి ఒక్కరి జీవితంలో కరోనా సంక్షోభం ఒక పీడకలగా మిగిలిపోయింది. కానీ, ఓ యువకుడికి మాత్రం రెండు సార్లు కరోనా సోకి.. తగ్గినా అతడికి కరోనా గురించి కానీ, దీని వల్ల ప్రపంచం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి కానీ అస్సలు తెలియదు. ఎందుకంటే, కరోనా ముందు కోమాలోకి వెళ్లిన ఆ యువకుడు పది నెలల తర్వాత తిరిగి ఇటీవల స్పృహలోకి వచ్చాడు.
2019 డిసెంబర్లో చైనాలో కరోనా వైరస్ ప్రబలిన విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తి.. ప్రభావం గురించి ఇతర దేశాలకు అంతగా తెలియని సమయంలో 2020 మార్చి 1న ఇంగ్లాండ్కు చెందిన 18 ఏళ్ల జోసెఫ్ ఫ్లావిల్ను ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో జోసెఫ్కు మెదడుకు దెబ్బతగలడంతో కోమాలోకి వెళ్లాడు. అదే సమయంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి చివరి వారంలో అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. బ్రిటన్లోనూ తొలిదశ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
అప్పటి నుంచి జోసెఫ్ పది నెలలపాటు కోమాలోనే ఉన్నాడు. కరోనా.. లాక్డౌన్ కారణంగా కుటుంబసభ్యులు ఎవరినీ ఆస్పత్రి సిబ్బంది అతడి వద్దకు వెళ్లనివ్వలేదు. వైద్యులే అతడికి సంరక్షణగా ఉన్నారు. ఆస్పత్రిలో కరోనా బాధితుల తాకిడి పెరగడంతో జోసెఫ్కు రెండు సార్లు కరోనా సోకిందట. వైద్యులు దగ్గరుండి అతడిని పర్యవేక్షించడంతో మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల కోమా నుంచి తేరుకొని స్పృహలోకి రావడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పది నెలల కాలంలో ప్రపంచం అతలాకుతలమైన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నాడు జోసెఫ్. ఇంతకాలం కోమాలో ఉండి కరోనా సృష్టించిన కల్లోలాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు కరోనా నిబంధనలు పాటిస్తూ కొత్త ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంకా పూర్తిగా గాయాలు నయం కాకపోవడంతో జోసెఫ్కు మరికొంత కాలం చికిత్స అవసరం. దీంతో జోసెఫ్ ఆస్పత్రి ఖర్చులకు, అతడి జీవితం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ కొందరు ‘జోసెఫ్స్ జర్నీ’ పేరుతో ఫండ్ రైజింగ్ ప్రారంభించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?