అతడికి కరోనా గురించి తెలియదు!
కరోనా(కొవిడ్-19) వైరస్ గురించి తెలియని వారుండరు. గతేడాదంతా ఇది ప్రపంచాన్ని వణికించింది. కోట్ల మందికి సోకి.. లక్షల మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. కరోనా దెబ్బకు కుటుంబాలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి
ఇంటర్నెట్ డెస్క్: కరోనా (కొవిడ్-19) వైరస్ గురించి తెలియని వారుండరు. గతేడాదంతా ఇది ప్రపంచాన్ని వణికించింది. కోట్ల మందికి సోకి.. లక్షల మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. కరోనా దెబ్బకు కుటుంబాలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఏదో ఒక రకంగా కరోనా వల్ల బాధితులుగా మారినవారే. దీంతో ప్రతి ఒక్కరి జీవితంలో కరోనా సంక్షోభం ఒక పీడకలగా మిగిలిపోయింది. కానీ, ఓ యువకుడికి మాత్రం రెండు సార్లు కరోనా సోకి.. తగ్గినా అతడికి కరోనా గురించి కానీ, దీని వల్ల ప్రపంచం ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి కానీ అస్సలు తెలియదు. ఎందుకంటే, కరోనా ముందు కోమాలోకి వెళ్లిన ఆ యువకుడు పది నెలల తర్వాత తిరిగి ఇటీవల స్పృహలోకి వచ్చాడు.
2019 డిసెంబర్లో చైనాలో కరోనా వైరస్ ప్రబలిన విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తి.. ప్రభావం గురించి ఇతర దేశాలకు అంతగా తెలియని సమయంలో 2020 మార్చి 1న ఇంగ్లాండ్కు చెందిన 18 ఏళ్ల జోసెఫ్ ఫ్లావిల్ను ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో జోసెఫ్కు మెదడుకు దెబ్బతగలడంతో కోమాలోకి వెళ్లాడు. అదే సమయంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి చివరి వారంలో అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. బ్రిటన్లోనూ తొలిదశ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
అప్పటి నుంచి జోసెఫ్ పది నెలలపాటు కోమాలోనే ఉన్నాడు. కరోనా.. లాక్డౌన్ కారణంగా కుటుంబసభ్యులు ఎవరినీ ఆస్పత్రి సిబ్బంది అతడి వద్దకు వెళ్లనివ్వలేదు. వైద్యులే అతడికి సంరక్షణగా ఉన్నారు. ఆస్పత్రిలో కరోనా బాధితుల తాకిడి పెరగడంతో జోసెఫ్కు రెండు సార్లు కరోనా సోకిందట. వైద్యులు దగ్గరుండి అతడిని పర్యవేక్షించడంతో మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల కోమా నుంచి తేరుకొని స్పృహలోకి రావడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పది నెలల కాలంలో ప్రపంచం అతలాకుతలమైన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నాడు జోసెఫ్. ఇంతకాలం కోమాలో ఉండి కరోనా సృష్టించిన కల్లోలాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు కరోనా నిబంధనలు పాటిస్తూ కొత్త ప్రపంచంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంకా పూర్తిగా గాయాలు నయం కాకపోవడంతో జోసెఫ్కు మరికొంత కాలం చికిత్స అవసరం. దీంతో జోసెఫ్ ఆస్పత్రి ఖర్చులకు, అతడి జీవితం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ కొందరు ‘జోసెఫ్స్ జర్నీ’ పేరుతో ఫండ్ రైజింగ్ ప్రారంభించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం