Chandragiri: వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత

వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 06 Mar 2024 11:08 IST

తిరుపతి రూరల్‌: వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్వగ్రామం తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు, పోలీసులు మోహరించారు. అనంతరం ఆక్రమణలు తొలగించే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గ్రామస్థులకు మద్దతుగా వెళ్లారు. ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంట్లోనే నిర్బంధించారు. పులివర్తి నానిని కూడా గృహ నిర్బంధం చేశారు.

ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న మహిళకు గాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ స్థలాలు కొనుగోలు చేశామని.. అధికారులు వచ్చి వాటిని తొలగించడం తగదన్నారు. ఎమ్మెల్యే బంధువులు భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎవరూ అడ్డుచెప్పడం లేదని.. పేదల షెడ్లను మాత్రం తొలగిస్తున్నారని మండిపడ్డారు. 22 ఎకరాలను చెవిరెడ్డి తన అధీనంలో ఉంచుకున్నారని.. మఠం అధికారులు వాటిని వెంటనే స్వాధీన పరచుకోవాలని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని