Offbeat: 94ఏళ్లుగా ఆ పత్రికలో వార్తలు చేతిరాతలే!
వార్తాపత్రికకు ఒక్కోశైలి ఉంటుంది. వార్తల్లో అక్షరాల సరళి, సైజు, ఫాంట్ భిన్నంగా ఉంటాయి. వాటిని కంప్యూటర్లో డిజైన్ చేస్తుంటారు. ఒకప్పుడు టైప్రైటింగ్ మిషన్లో వార్తను టైప్ చేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. కానీ, చెన్నై కేంద్రంగా నడిచే ‘ది ముసల్మాన్’ అనే ఉర్దూ వార్తాపత్రిక మాత్రం మరింత
ఒక్కో వార్తా పత్రికకు ఒక్కో శైలి ఉంటుంది. వార్తల్లో అక్షరాల సరళి, సైజు, ఫాంట్ భిన్నంగా ఉంటాయి. వాటిని కంప్యూటర్లో డిజైన్ చేస్తుంటారు. ఒకప్పుడు టైప్రైటింగ్ మిషన్లో వార్తను టైప్ చేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. కానీ, చెన్నై కేంద్రంగా నడిచే ‘ది ముసల్మాన్’ అనే ఉర్దూ వార్తాపత్రిక మాత్రం మరింత విభిన్నం. ఎందుకంటే ఆ పత్రికలో ప్రతి వార్తను ఆ సంస్థ ఉద్యోగులు స్వహస్తాలతో రాస్తారు. అలా చేతితో రాసిన వార్తలను.. ప్రింట్ చేసి పాఠకులకు చేరవేస్తారు. 94 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ వార్తాపత్రిక.. ప్రపంచంలోనే ఏకైక ‘చేతిరాత’ వార్తాపత్రికగా పేరుపొందింది.
ది ముసల్మాన్ ఉర్దూ వార్తాపత్రికకు ప్రస్తుతం సయ్యద్ ఆరిఫుల్లా ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య పదిలోపే. 800 చదరపు అడుగుల గదిలోనే ఈ పత్రికా సంస్థను నడిపిస్తున్నారు. నాలుగు పేజీలు ఉండే ఈ వార్తాపత్రికలో వార్తలను చేతితో రాయడానికి కాలిగ్రాఫీ నైపుణ్యం ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. వారిని కాతిబ్స్ అని పిలుస్తారు. ఒక్కో పేజీలో వార్తలు రాయడానికి వారికి కనీసం మూడు గంటలు పడుతుందట. వార్తల్లో ఒక్క తప్పు దొర్లినా.. మళ్లీ కొత్త పేజీలో మొదటి నుంచి వార్తలు రాయాల్సిందే. తప్పులు లేకుండా వార్తలు రాసిన తర్వాత వాటిని నెగటివ్స్గా మార్చి ప్రతులు ప్రచురిస్తారు. తొలిపేజీలో జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. 2,3 పేజీల్లో స్థానిక వార్తలు.. నాలుగో పేజీలో క్రీడావార్తలు ఉంటాయి.
ప్రకటనలకు మాత్రమే కంప్యూటర్
ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండగా ఇంకా చేతిరాతతోనే వార్తలు ఎందుకు రాస్తున్నారని అడిగితే.. తన తాత ప్రారంభించిన ఈ చేతిరాత వార్తపత్రికను అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆరిఫుల్లా తెలిపారు. దీనికి డిజిటల్ రూపం ఇచ్చే ఆలోచన లేదని, తాత ప్రారంభించిన పత్రిక ప్రచురణ విధానంలో మార్పులు చేయబోమని ఆరిఫుల్లా స్పష్టం చేశారు. అయితే, పత్రికకు ఆదాయం ప్రకటనలే కాబట్టి.. వివిధ సంస్థలు ఇచ్చే ప్రకటనలను కంప్యూటర్లో డిజైన్ చేసి పత్రిక పేజీల్లో అతికిస్తారు. అలాగే, ‘ది ముసల్మాన్’ లోగోను కూడా ప్రింట్ తీసి.. పత్రికకు అతికిస్తారు. ప్రభుత్వం, ఇతర ప్రైవేటు సంస్థలు ఇచ్చే ప్రకటనలతో వచ్చే ఆదాయంతో పత్రికను నడిపిస్తున్నట్లు ఎడిటర్ ఆరిఫుల్లా చెప్పారు.
94ఏళ్ల చరిత్ర..
1927లో చెన్నైలోని ట్రిప్లికేన్ హైరోడ్లో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆరిఫుల్లా తాత సయ్యద్ అజ్మతుల్లా ఈ ‘ది ముసల్మాన్’ ఉర్దూ వార్తాపత్రికను ప్రారంభించారు. స్వహస్తాలతో వార్తలు రాసి.. వాటిని అచ్చువేసి పాఠకులకు పంపిణీ చేసేవారు. ముస్లింలకు స్థానిక వార్తలు తెలియజేసే ఉర్దూ పత్రిక లేదని భావించి అజ్మతుల్లా ఈ పత్రికను స్థాపించారట. అప్పటి నుంచి చేతిరాతతోనే వార్తలను ప్రచురిస్తున్నారు. ఎంతో మంది పత్రికను మరింత అభివృద్ధి పర్చమని, టెక్నాలజీని ఉపయోగించమని చెప్పినా అజ్మతుల్లా తను ప్రారంభించిన చేతిరాత పద్ధతిలోనే పత్రికను కొనసాగించాలని సంకల్పించారు.
మూడు తరాల సంపాదకులు
అజ్మతుల్లా మరణానంతరం ఆయన కుమారుడు ఫజుల్లా ఈ పత్రికకు ఎడిటర్గా బాధ్యతలు స్వీకరించారు. ఫజుల్లాకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరూ వివిధ వృత్తుల్లో స్థిరపడటంతో చేతిరాతతో ప్రచురించే ఈ పత్రిక తనతోనే అంతమైపోతుందని మదనపడుతూ 2008లో ఫజుల్లా కన్నుమూశారు. దీంతో అతడి కుమారుల్లో ఒకరైన ఆరిఫుల్లా తన తాత, తండ్రి నిర్వహించిన ఈ పత్రికను కొనసాగించడానికి ముందుకొచ్చారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆరిఫుల్లా.. ఎన్నో ఉద్యోగావకాశాలు వదులేసుకొని సంస్థ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చీఫ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చందాదారులు
ఈ పత్రికను ముస్లింలే కాదు.. ఉర్దూ వచ్చిన ఇతరులు కూడా చదువుతుంటారని ఆరిఫుల్లా వెల్లడించారు. ఈ ‘ది ముసల్మాన్’ ఉర్దూ పత్రిక రోజుకు 22వేల కాపీలు అమ్ముడుపోతున్నాయి. ఏడాది చందా ₹400 చెల్లించి.. ప్రతి రోజు ఈ పత్రికను పొందొచ్చు. కేవలం చెన్నైలోనే కాదు.. దేశవ్యాప్తంగా దిల్లీ, ముంబయి, కోల్కతాలోనూ ఈ పత్రికకు చందాదారులు ఉన్నారు. 94 ఏళ్లలో ఒక్క రోజు కూడా పత్రిక ప్రచురణను ఆపింది లేదట.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి