Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. అమెరికాలో ఆకలితో తెలంగాణ యువతి
అమెరికా (America)లో మాస్టర్స్ చేయాలని తెలంగాణ నుంచి వెళ్లిన ఓ మహిళ షికాగో (Chicago) రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను భారత్కు తీసుకురావాలని అభ్యర్థిస్తూ.. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్కు లేఖ రాశారు. ఈ లేఖను భారాస నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత
భాజపా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపై ఆ జిల్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయంలో బైఠాయించి ఎంపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్వింద్ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్, బాల్కొండ, బోధన్ మండలాలకు చెందిన కార్యకర్తలు నిరసన తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మూడు పెళ్లిళ్లు ప్రమాదమా? హత్యలు ప్రమాదమా?: సీపీఐ నారాయణ
ముఖ్యమంత్రి వద్ద పసలేకే పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా? అని పరోక్షంగా వివేకా హత్యను ప్రస్తావించారు. బాబాయిని చంపడం నేరం కాదని చెబుతారా? అని నిలదీశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సీమకు తీరని ద్రోహం.. ఆ పాపం జగన్దే: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం, మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సాగునీటి ప్రాజెక్టులే ఓ ఉదాహరణ అని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు నాశనమైన తీరున ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. వనమా పిటిషన్పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు
తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అత్యవసర పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గంటగంటకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ‘హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20వేల జరిమానా..’ క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణాశాఖ
‘‘ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే మీకు రూ.20వేల జరిమానా..’’ అంటూ ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ప్రకటించినట్లు గత రెండు రోజులుగా వాట్సాప్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం తెగ వైరల్ అవుతోంది. ఆగస్టు నెల నుంచి ఈ జరిమానా అమల్లోకి వస్తుందని పలు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. గొంతుకోసి.. కారంపొడి చల్లి.. మహిళా డాక్టర్ దారుణ హత్య
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్ రాధ హత్యకు గురయ్యారు. నగరంలోని జవ్వారుపేట జంక్షన్లో నివాసముంటున్న డాక్టర్ ఉమామహేశ్వరరావు, రాధ దంపతులు చిన్నపిల్లల వైద్యులు. సొంతంగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతికిరాతకంగా చంపేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఇద్దరు ఇండిగో పైలట్ల లైసెన్సులు సస్పెండ్ చేసిన డీజీసీఏ
ఇండిగో (IndiGo) ఎయిర్లైన్స్లో పనిచేసే ఇద్దరు పైలట్ల లైసెన్సులను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) సస్పెండ్ చేసింది. గత నెలలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో విమాన ల్యాండింగ్ సమయంలో తోక భాగం నేలను తాకిన ఘటనలో వీరిద్దరిపై చర్యలు తీసుకుంది. భద్రతా పరమైన నిబంధనలు పాటించనందువల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఐటీపీఓలో మోదీ పూజలు.. శ్రమ జీవులకు సన్మానం
ప్రతిష్ఠాత్మక ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు భారత్ సిద్ధమవుతోంది. దిల్లీ వేదికగా సెప్టెంబరులో జరగనున్న ఈ సమావేశానికి దేశాధినేతలు, పెద్దఎత్తున విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ప్రధాన వేదిక అయిన ‘ఐటీపీఓ కాంప్లెక్స్ (ITPO Complex)’ను ఆధునికీకరించింది. దీని ప్రారంభంలో భాగంగా ప్రధాన మోదీ(PM Modi) పూజలు నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు