Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. జాబ్ క్యాలెండర్ పక్కనపెట్టిన సీఎం జగన్
నిరుద్యోగులను ఊరిస్తూ ఉత్తుత్తి ప్రకటనలు చేయడంలో వైకాపా సర్కారుకు మరే ప్రభుత్వమూ సాటిరాదు. ఉద్యోగ నియామకాల క్యాలెండర్ జారీ చేస్తానని డాంబికాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో మడమ తిప్పేశారు. కనీసం ప్రకటించిన పోస్టుల భర్తీకీ సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వక ఘోరంగా విఫలమయ్యారు. ఏళ్లుగా మాటలతోనే కాలం గడిపేస్తుంటే.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయసు రీత్యా అర్హత కోల్పోతున్నామని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్రావు
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పొనుగోటి నవీన్రావు శుక్రవారం ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే జస్టిస్ నవీన్రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. టెట్ నిర్వహణకు 101 రోజులు
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు మొత్తం 101 రోజులు పడుతుందని విద్యాశాఖ అంచనా వేసింది. నోటిఫికేషన్ జారీ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు సాఫ్ట్వేర్ సిద్ధం చేయడానికి, దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు సర్కారుకు నివేదించారు. పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి 21 రోజులు కలిపి.. మొత్తం 101 రోజులు పడుతుందని అంచనా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఉమ్మడి పౌరస్మృతిపై 50 లక్షల స్పందనలు
రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం...ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై గురువారం వరకు 50 లక్షల స్పందనలు లా కమిషన్కు చేరాయి. ఆన్లైన్లోనే కాకుండా హార్డ్కాపీలను లా కమిషన్ స్వీకరించిందని, దీంతో మొత్తం స్పందనల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసే గడువు శుక్రవారంతో ముగియనుంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. టెస్లా కారు రూ.20 లక్షలకే!
చైనాలో తయారీ ప్లాంట్లు ఉన్న టెస్లా.. ఇపుడు మన దేశంలోనూ ప్లాంటు ఏర్పాటు చేసి ఇండో-పసిఫిక్ దేశాలకు విద్యుత్ వాహనాల(ఈవీ)ను ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో ఉందని తెలుస్తోంది. ఇందుకోసం ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా వేగంగానే అడుగులు వేస్తున్నట్లు, ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. టెస్లా ఇక్కడ ఉత్పత్తి చేసే కార్ల ధరలు రూ.20 లక్షలతో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నేడు ప్రైవేటు డిగ్రీ కళాశాలల బంద్
ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు వ్యతిరేకంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం శుక్రవారం కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. కోర్సుల వారీగా ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు-22ను రద్దు చేయాలని, ఫీజులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన బోధన రుసుములతో కళాశాలలు నిర్వహించడం కష్టమని, ఒక శాస్త్రీయ విధానమంటూ లేకుండా ఫీజులు నిర్ణయించారని సంఘం అధ్యక్షుడు గుండారెడ్డి విమర్శించారు.
7. 17న వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేసినట్లు తితిదే తెలిపింది. ఈ నెల 16న ఎటువంటి వీఐపీ సిఫారసు లేఖలు అనుమతించబోమని పేర్కొంది.
8. పార్లమెంటు ముందుకు 27 బిల్లులు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ భేటీల్లో మొత్తం 27 బిల్లులు చట్టసభల ముందుకు రానున్నాయి. వీటిలో 21 కొత్తవి కాగా...మిగిలిన ఆరు బిల్లులు ఇప్పటికే ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి. తీవ్ర చర్చకు దారి తీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో కనిపించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ట్రక్కు డ్రైవరుగా చేరిన సీఈవో
ఆస్ట్రేలియాకు చెందిన ఓ సినిమా హాళ్ల సంస్థ సీఈవో గ్రెగ్ రాస్ 60 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ట్రక్కు డ్రైవర్గా జీవితం ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు. గ్రెగ్ రాస్ ఓ కార్ల సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నప్పుడు జీవితంలో ఏదో కోల్పోయానన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా గడపాలనుకున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మానవులకూ బర్డ్ఫ్లూ ముప్పు
కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. మానవులకూ సోకేలా అది రూపాంతరం చెందే ముప్పు లేకపోలేదంటూ హెచ్చరించింది. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు పక్షుల్లో వ్యాపిస్తాయి. అయితే వాటిలో ఒకటైన బర్డ్ఫ్లూ కారక హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు