Ts Elections: ఉపాధ్యాయ సంఘాల పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించలేదంటూ ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించలేదంటూ ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది. పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వకపోవడంతో ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు పిటిషన్లో పేర్కొన్నాయి. ఎన్నికల విధుల్లో ఉండి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 28వ తేదీ వరకు 1.75లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని కోర్టుకు వివరించారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి