Revanth Reddy: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం తప్పింది. సీఎం కొడంగల్‌ వెళ్తుండగా... కాన్వాయ్‌లోని కారు టైరు పంక్చరై పేలిపోయింది.

Updated : 08 Apr 2024 18:41 IST

వికారాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. సీఎం కొడంగల్‌ వెళ్తుండగా... కాన్వాయ్‌లోని కారు టైరు పంక్చరై పేలిపోయింది. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొండగల్ వెళ్లేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. మన్నెగూడ బైపాస్‌ వద్దకు రాగానే కాన్వాయ్‌లోని ఒక కారు టైర్‌ పేలింది. వెంటనే డ్రైవర్‌ ఆ కారును పక్కకు మళ్లించి నిలిపి వేశారు. ముఖ్యమంత్రి వేరే కారులో ఉండటంతో కాన్వాయ్‌ ముందుకు సాగింది. టైర్‌ మార్చిన సిబ్బంది కొద్ది సేపటికి కొండగల్‌ చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానిక ఎస్సై మధుసూదన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని