తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
అన్నం తినకపోతే కడుపు నిండినట్టే ఉండదు. చాలామంది నోట వినిపించే మాట ఇది. అవును. మనదగ్గరే కాదు, ప్రపంచంలో చాలాచోట్ల అన్నమే ప్రధాన ఆహారం. అందరికీ అందుబాటులో ఉండేదీ, చవకైనదీ ఇదే. కూరలైనా, చారైనా, పెరుగైనా.. దేంతోనైనా కలిసిపోయి ఆయా వంటకాల రుచులను మరింత పెంచుతుంది. అందుకే అన్నమంటే...
అన్నం తినకపోతే కడుపు నిండినట్టే ఉండదు. చాలామంది నోట వినిపించే మాట ఇది. అవును. మనదగ్గరే కాదు, ప్రపంచంలో చాలాచోట్ల అన్నమే ప్రధాన ఆహారం. అందరికీ అందుబాటులో ఉండేదీ, చవకైనదీ ఇదే. కూరలైనా, చారైనా, పెరుగైనా.. దేంతోనైనా కలిసిపోయి ఆయా వంటకాల రుచులను మరింత పెంచుతుంది. అందుకే అన్నమంటే అంత ఇష్టం. ఇప్పుడంతా మల్లెపూవులా మెరిసే తెల్ల అన్నాన్నే ఇష్టపడుతున్నారు గానీ ఒకప్పుడు ఎక్కువగా దంపుడు బియ్యమే తినేవారు. మన తాత, ముత్తాతలు బలంగా, జబ్బుల బాధలేవీ లేకుండా ఆరోగ్యంగా ఉండటానికిదే కారణమని చెప్పుకోవటం వింటూనే ఉంటాం. అందుకేనేమో తెల్ల బియ్యం మంచివా? దంపుడు బియ్యం మంచివా? అనే సందేహం ప్రతి మదినీ తొలుస్తుంటుంది. మధుమేహం వంటి జబ్బులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దీనిపై చర్చ మరింత ఎక్కువైంది కూడా.
దంపుడు బియ్యంలో పోషకాలు మెండు
తెల్ల బియ్యం, దంపుడు బియ్యం రెండింట్లోనూ పిండి పదార్థం ఉంటుంది. కొద్దిగా ప్రొటీన్ కూడా లభిస్తుంది. కొవ్వు అసలే ఉండదు. తెల్ల బియ్యానికీ దంపుడు బియ్యానికీ ప్రధానమైన తేడా తవుడు. దంపుడు బియ్యం, ఒక పట్టు బియ్యం తవుడుతో కూడుకొని ఉంటుంది. ఇందులో గింజకు సంబంధించిన అన్ని పోషకాలూ ఉంటాయి. తవుడుతో కూడిన పొరలోనే పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల వంటివి ఉంటాయి. అదే తెల్ల బియ్యమైతే లోపలి గింజ మాత్రమే ఉంటుంది. పోషకాల పాళ్లు తక్కువ. ముఖ్యంగా పీచు దాదాపు ఉండదనే అనుకోవచ్చు. వంద గ్రాముల దంపుడు బియ్యంతో 1.8 గ్రాముల పీచు లభిస్తే తెల్లబియ్యంతో కేవలం 0.4 గ్రాములే అందుతుంది. మిగతా పోషకాల విషయానికి వస్తే- 100 గ్రాముల దంపుడు బియ్యంలో థయమిన్ 6%, నియాసిన్ 8%, విటమిన్ బి6 7%, మాంగనీస్ 45%, మెగ్నీషియం 11%, ఫాస్ఫరస్ 8%, ఐరన్ 2%, జింక్ 4% ఉంటాయి. అదే 100 గ్రాముల తెల్ల బియ్యంలోనైతే థయమిన్ 1%, నియాసిన్ 2%, విటమిన్ బి6 5%, మాంగనీస్ 24%, మెగ్నీషియం 3%, ఫాస్ఫరస్ 4%, ఐరన్ 1%, జింక్ 3% మాత్రమే ఉంటాయి. దంపుడు బియ్యంలో పోషకాలు మెండుగా ఉంటాయనటానికిదే నిదర్శనం.
దంపుడు బియ్యంతో మధుమేహం ముప్పు తక్కువ
దంపుడు బియ్యంలో దండిగా ఉండే మెగ్నీషియం, పీచు రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. క్రమం తప్పకుండా దంపుడు బియ్యం వంటి నిండు గింజ ధాన్యాలు తినేవారికి మధుమేహం ముప్పు 31% తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదే తెల్ల బియ్యం ఎక్కువగా తినేవారికి మధుమేహం ముప్పు పెరుగుతోందనీ వివరిస్తున్నాయి. దీనికి మూలం తెల్లబియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండటం. రక్తంలో గ్లూకోజు ఎంత వేగంగా కలుస్తోందనే దాన్ని జీఐతో సూచిస్తారు. దంపుడు బియ్యం జీఐ 50 కాగా.. తెల్లబియ్యం జీఐ 89. రక్తంలో గ్లూకోజు వేగంగా కలిసేలా చేసే పదార్థాలతో మధుమేహం వంటి రకరకాల జబ్బుల ముప్పులు పెరుగుతాయి.
దంపుడు బియ్యంతో గుండెజబ్బు ముప్పు తక్కువ
దంపుడు బియ్యంలో లిగ్నాన్లనే వృక్ష రసాయనాలుంటాయి. ఇవి రక్తంలో కొవ్వు మోతాదును, రక్తపోటును తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడతాయి. దంపుడు బియ్యం వంటి నిండు గింజ ధాన్యాలు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బుల ముప్పు 16-21% తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. నిండు గింజ ధాన్యాలు చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటంలోనే కాదు, మంచి కొలెస్ట్రాల్ పెరగటంలోనూ తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, మంచి కొలెస్ట్రాల్ తగ్గితే గుండెజబ్బు ముప్పు పెరుగుతుందన్నది తెలిసిందే. దంపుడు బియ్యం తవుడులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండెజబ్బు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాల జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి.
దంపుడు బియ్యంతో బరువు అదుపు
తెల్ల బియ్యానికి బదులు దంపుడు బియ్యం తినటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇవి బరువు, శరీర ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ), నడుం, తుంటి చుట్టుకొలత తగ్గటానికి తోడ్పడతాయి. నిండు గింజ ధాన్యాలు తక్కువగా తినేవారితో పోలిస్తే వీటిని క్రమం తప్పకుండా తినేవారు తక్కువ బరువుతో ఉంటున్నట్టు 12 ఏళ్ల పాటు నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంటోంది. అలాగే అధిక బరువు, ఊబకాయ మహిళల్లో బరువుతో పాటు తుంటి చుట్టుకొలతా తగ్గటం గమనార్హం.
ఏవైనా మితంగానే..
దంపుడు బియ్యంలో పోషకాలు, లాభాలు ఎక్కువగా ఉన్నమాట నిజమే అయినా వీటితో కొన్ని నష్టాలు లేకపోలేదు. చిత్రంగా దంపుడు బియ్యంలో ఫైటిక్ యాసిడ్, ఫైటేట్ల వంటి విరుద్ధ పోషకాలూ ఉంటాయి. ఇవి ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడతాయి. దంపుడు బియ్యంలో ఆర్సెనిక్ అనే విషతుల్య రసాయనమూ ఎక్కువగానే ఉంటుంది. ఆర్సెనిక్ను చాలాకాలంగా తీసుకుంటే దీర్ఘకాల జబ్బులు తలెత్తే అవకాశముంది. అంటే దంపుడు బియ్యం, తెల్లబియ్యం రెండింటితోనూ కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటున్నాయన్నమాట. మరెలా అని చింతించకండి. ఏ బియ్యాన్నయినా మితంగా తీసుకోవటం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు. కొన్నిసార్లు దంపుడు బియ్యం, కొన్నిసార్లు తెల్ల బియ్యం.. ఇలా మార్చి మార్చి తినటం ద్వారా రెండింటి లాభాలనూ పొందొచ్చు.
ఇవీ చదవండి
ప్రశాంత జీవితానికి పంచ సూత్రాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!