అక్కడి వాళ్లకి కూని రాగాలే పేర్లు
మేఘాలయలోని ఓ మారుమూల గ్రామం కాంగ్థాంగ్. ఇక్కడ 200 వరకు ఇళ్లు.. 700కుపైగా జనాభా ఉంటుంది. ఇక్కడ అందరిని పేర్లకు బదులు కూని రాగాలతో పిలుస్తుంటారు. ఈ గ్రామంలో పెట్టిన బిడ్డకి విజిల్ వేస్తూ, పక్షుల అరుపును అనుకరిస్తూ.. సినిమా పాటల్లోని ట్యూన్ను హమ్ చేస్తూ పేర్లు పెడతారు. వీటిలో పదాలు
రామారావు.. విజయ్.. అరుణ.. ప్రియ.. నాని.. మన దగ్గర పేర్లు అంటే ఇలా ఉంటాయ్ కదా! కానీ మేఘాలయలోని ఓ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు కూని రాగాలతో పిలుచుకుంటారు. అక్కడి వారికి పేర్లు ఉండవు. రాగాలతోనే పిలుపులు.. పలకరింపులు ఉంటాయి. ఎందుకంటే.. అది వారి ఆచారం. విచిత్రంగా ఉంది కదా! మరి ఆ ఆచారం గురించి మరింత తెలుసుకుందాం పదండి..
మేఘాలయలోని ఓ మారుమూల గ్రామం కాంగ్థాంగ్. ఇక్కడ 200 వరకు ఇళ్లు.. 700కుపైగా జనాభా ఉంటుంది. ఇక్కడ మనుషుల్ని పేర్లకు బదులు కూని రాగాలతో పిలుస్తుంటారు. ఈ గ్రామంలో పుట్టిన బిడ్డకి విజిల్ వేస్తూ, పక్షుల అరుపును అనుకరిస్తూ.. సినిమా పాటల్లోని ట్యూన్ను హమ్ చేస్తూ పేర్లు పెడతారు. వీటిలో పదాలు ఉండవు.. కేవలం రాగాలే. ఒక్కో పేరు, అదేనండీ.. ఒక్కో కూని రాగం 30 సెకండ్ల నిడివి ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆరు సెకన్ల నిడివితో పిలిస్తే... అడవిలో వేట / పనికి వెళ్తే పూర్తి నిడివి రాగంతో పిలుస్తారట.
పుట్టిన బిడ్డకు రాగంతో పేరు పెట్టడానికి భారీ కసరత్తే జరుగుతుంది. తల్లి, తండ్రి వేర్వేరుగా ఓ రాగాన్ని సృష్టించి/ఎంచుకొని ఆలపిస్తారు. అందులో ఏది బాగుందో అది పెడతారు. ఇక్కడ ఎవరూ ఒకరిని పిలిచిన కూనిరాగంతో మరొకరిని పిలవరు. పేర్లు గుర్తుపెట్టుకున్నట్టే.. రాగాలను గుర్తుపెట్టుకుంటారు. ఇలా రాగాలతో పేరు పెట్టే పద్ధతిని జింగవా యోబి అని పిలుస్తారట. అంటే, అమ్మ ప్రేమ అని అర్థం.
ఈ పద్ధతిలో పేర్లు పెట్టడానికి ఓ కారణముంది. ఈ ప్రాంతానికి చెందినవారి పూర్వీకులకు మూఢ నమ్మకాలెక్కువ. అడవిలో వేటకు వెళ్లినప్పుడు దెయ్యాల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా కూని రాగాలతో పిలుచుకునేవారట. ఒకవేళ పేరు పెట్టి పిలిస్తే.. దెయ్యాలు వారిని గుర్తు పట్టి చంపుతాయని భావించేవారట. అందుకే, వారిని దెయ్యాలు గుర్తుపట్టకుండా ఉండటం కోసం పేర్లకు బదులు ఈ కూని రాగాలను ఎంపిక చేసుకున్నారు. అలా ఇది ఆచారంగా మారిపోయిందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అయితే కాలంతో పాటు వారూ మారుతున్నారు. చిన్నారులు, యువకులు చదువుకోవడం.. సమీప పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో ప్రస్తుతం వారికంటూ ఓ పేరును పెట్టుకుంటున్నారు. పుట్టే బిడ్డలకు కూడా పేర్లు పెడుతున్నారు. కానీ ఇంట్లో.. గ్రామంలో ఉన్నప్పుడు మాత్రం వారిని కూని రాగాలతోనే పిలుస్తారట.
- ఇంటర్నెట్ డెస్క్
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ