సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది.
-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
ఫిబ్రవరి 14న వసంత పంచమి
సరస్వతి ఒక వ్యక్తి కాదు.. జడత్వం, నిర్జీవం అనే మాటే లేకుండా ఎల్లప్పుడూ ఉత్సాహంతో నిండి ఉండే ఆత్మస్వరూపమే. మన జీవితంలోని ఉత్సాహమే సరస్వతి. ఆమె జ్ఞాన, గాన, ధ్యానాలు మూర్తీభవించిన స్వరూపం. నేను ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతి. విద్యకు, జ్ఞానానికి అధి దేవత అయిన సరస్వతి రూపం, ఆ భావన ప్రపంచంలోనే అసమానమైనది. ఎందుకో మీకు తెలుసా?
ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. వీణావాద్యం (సంగీతం) మన కుడి మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఆమె మరొక చేతిలో జపమాల కనిపిస్తుంది. అది జీవితంలోని ధ్యాన గుణాన్ని సూచిస్తుంది.
గాన (సంగీతం), జ్ఞాన (మేధో జ్ఞానం) ధ్యాన (ధ్యానం). ఈ మూడూ కలిగి ఉన్నపుడే విద్య పరిపూర్ణం అవుతుంది. ఈ మూడింటిలో బాగా ప్రావీణ్యం ఉన్నవారినే విద్యావంతులు లేదా నాగరికులు అని పిలవగలం. కాబట్టి పిల్లలు సంగీతం, యోగా నేర్చుకునేలా మనం శ్రద్ధ వహించాలి. అదే సమయంలో వారికి శాస్త్ర, వైజ్ఞానిక దృక్పథం కూడా ఉండేలా చూడాలి. వారు పెద్దవారు అవుతున్న కొద్దీ వారిని ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించాలి. తద్వారా వారిలో విషయాలను తెలుసుకునే ఆసక్తిని, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించగలుగుతారు.
సరస్వతి వాహనం హంసగా పేర్కొంటారు. పాలు, నీళ్లు కలిపి పెడితే హంస అందులోని నీటిని వేరు చేసి పాలు మాత్రమే తాగుతుందని చెబుతారు. ఇది విచక్షణాశక్తిని (వివేకాన్ని) సూచిస్తుంది. దీన్ని ఉపయోగించి మనం జీవిత అనుభవాల్లో సానుకూలమైన పాఠాలను తీసుకుని, ప్రతికూలమైన వాటిని వదిలివేస్తాం. సరస్వతీదేవిని అనుసరించి నెమళ్ళు ఉండడం మీరు గమనించండి. నెమళ్లు వర్షం వచ్చేముందు మాత్రమే పురివిప్పి నాట్యం చేస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేయవు. సరైన జ్ఞానాన్ని, సరైన చోట, సరైన సమయంలో ప్రదర్శించే సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది.
వివిధ రకాల జ్ఞాన సాధనలు వెల్లివిరిసే చైతన్య స్వరూపమే సరస్వతి. ఆమె ఆధ్యాత్మిక జ్యోతికి మూలం. అన్ని అజ్ఞానాలను తొలగించేది. అన్ని జ్ఞానాలకు మూలం ఆమె. ఆ తల్లి వీణ వాయిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. మానవ జీవితానికి, సరస్వతీ మాత వీణ వాయించడానికి సంబంధం ఏమిటి? అనే సందేహం రావొచ్చు. వీణ మానవ శరీరాన్ని సూచిస్తుంది. వీణకు 7 తీగలు ఉన్నట్లే, మన శరీరం కూడా ఏడు ధాతువులతో రూపొందింది. వీణను సరిగ్గా శ్రుతి చేస్తే.. దాని నుంచి వినిపించే సంగీతం చెవులకు మధురంగా ఉంటుంది. అదే విధంగా జీవితాన్ని చక్కగా శ్రుతిచేస్తే కలిగేది దివ్యానుభూతి, పరమానందం.
అనేక విద్యాసంస్థల్లో సరస్వతీ దేవి విగ్రహాన్ని మీరు చూడొచ్చు. ఆమె సంపూర్ణమైన విద్యాభ్యాసాన్ని సూచిస్తుంది. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది విద్య నుంచి ఎప్పుడూ దూరంగా లేదు. సరస్వతీదేవి ఒక రాతిపై కూర్చొని ఉన్నట్లు చూపుతారు. జ్ఞానం అనేది మీకు రాయివంటి నిశ్చలత్వాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అది కదలిపోతూ, ఊగుతూ ఉండదు. స్థిరంగా ఉంటుంది. నెమలి సౌందర్యాన్ని, ఉత్సవాన్ని సూచిస్తుంది. ఏ జ్ఞానమైనా మీలో అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించాలి. ఆధ్యాత్మికత అనేది అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. ఆత్మాభివృద్ధికి సహాయపడేది ఏదైనాసరే.. అది ఆధ్యాత్మికతే. ఆధ్యాత్మికతలో భాగంగా మనం స్వాధ్యాయం (శాస్త్రీయ జ్ఞానం), ఆత్మ జ్ఞానం రెండూ నేర్చుకుంటాం. యోగాసనాలు వేస్తాం.. ధ్యానం కూడా చేస్తాం. అంటే బుద్ధితో కూడిన జ్ఞానం, సంగీతం, కళలు, సంస్కృతి, నాట్యం, ధ్యానం ఇవన్నీ ఆధ్యాత్మికతలో భాగాలే. ఇవన్నీ సరస్వతీదేవి స్వరూపంలో మనకు కనిపిస్తాయి. ఈ భాగాల్లో ఏ ఒక్కటి లేకున్నా, ఆ విద్య పరిపూర్ణం అని చెప్పలేం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!