ప్యాంట్ జిప్పై ‘YKK’ని గమనించారా?
మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు మీరూ వాటిని వేసుకొనే ఉంటారు. అయితే, అనేక బ్రాండ్ దుస్తుల్లో ప్యాంటు జిప్పై YKK అనే అక్షరాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? బ్రాండ్లు వేరయినా జిప్పై ఆ అక్షరాలే
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్ దుస్తులు! చాలామంది వాటిని చూసుంటారు. వేసుకునీ ఉంటారు. మీకు గుర్తుంటే, అనేక బ్రాండ్ దుస్తుల్లో ప్యాంటు జిప్పై YKK అనే అక్షరాలు కనిపిస్తాయి. మీరెప్పుడైనా గమనించారా? బ్రాండ్లు వేరయినా జిప్పై ఆ అక్షరాలే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఇదిగో..
YKK అంటే ‘యొషిదా కొంగ్యో కుబుషికిగైషా (యోషిదా ఇండస్ట్రీస్ లిమిటెడ్)’. నోరు తిరగకపోయినా పర్లేదు. మనకు పేరు ముఖ్యం. జపాన్కు చెందిన టాడావో యోషిదా 1934లో దీనిని స్థాపించారు. 71 దేశాల్లో 109 యూనిట్లు కలిగి ఉన్న ఈ సంస్థ నుంచే ప్రపంచవ్యాప్తంగా 90శాతం జిప్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కంపెనీ కేవలం జిప్పర్స్నే కాదు.. జిప్లను తయారు చేసే యంత్రాలను సైతం తయారు చేస్తోంది. జార్జియాలో YKKకి రోజుకి 70 లక్షల జిప్లు ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ ఉంది. 1966లో ప్రస్తుతం జీన్స్ ప్యాంట్లకు ఉండే Y జిప్లను ఈ సంస్థే ఆవిష్కరించింది. ప్యాంటును కుట్టే మెషీన్లోనే ఈ జిప్ను కుట్టే పరికరాన్నీ అమర్చడంతో జీన్స్ ఉత్పత్తి, అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
1968లో జపాన్ దాటి కెనడాలో తొలిసారి YKK తన శాఖను ఏర్పాటు చేసింది. నాణ్యమైన జిప్లను తయారు చేస్తుండటంతో కంపెనీ వెనక్కితిరిగి చూసుకోలేదిక. అనేక దేశాల్లో శాఖలు విస్తరింపజేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంది. ఈ సంస్థకు చాలా కాలం పాటు పోటీనే లేదు. ప్రస్తుతం ఈ కంపెనీకి పోటీగా పలు సంస్థలొచ్చినా.. ఇప్పటికీ జీన్స్ ప్యాంట్ల జిప్లు ఈ కంపెనీవే ఉంటాయి. జిప్లతోపాటు ఇప్పుడు ఈ సంస్థ దుస్తులు, బ్యాగులు, ఇతర ఫ్యాషన్ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత