LS Polls: 102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 18వ సార్వత్రిక ఎన్నికల (Lok Sabha polls) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. తొలిదశలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకూ ఓటింగ్ జరగనుంది.
కూటముల పోరు.. కలిసొచ్చేది ఎవరికి?
ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సాగే ఈ ప్రక్రియను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ తగు చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. ఈసీ వివరాల ప్రకారం తొలి విడత సమగ్ర స్వరూపమిది.
- మొత్తం లోక్సభ స్థానాలు: 102 (73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ)
- పోటీలో ఉన్న అభ్యర్థులు: 1625 మంది (1491 మంది పురుషులు, 134 మంది మహిళలు)
- పోలింగ్ కేంద్రాలు / సిబ్బంది: 1.87 లక్షలు / 18 లక్షల మంది
- ఓటర్లు: 16.63 కోట్ల మంది (పురుషులు 8.4 కోట్లు, మహిళలు 8.23 కోట్లు, ఇతరులు 11,371 మంది)
- 35.67 లక్షల మంది తొలిసారి తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
- పోలింగ్ ఏర్పాట్లకు 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, సుమారు లక్ష వాహనాల వినియోగం
- 50 శాతానికిపైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకం
- 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది ఓటర్లు, 13.89 లక్షల మంది దివ్యాంగులకు ఇంటివద్దే ఓటు హక్కు సౌకర్యం
- 5 వేలకుపైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు, 1000 ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు.
ప్రాంతాల వారీగా స్థానాలు
తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తర్ప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ (5), బిహార్ (4), పశ్చిమ బెంగాల్ (3), అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ (2), ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ-కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి (1).
బరిలో ఉన్న ప్రముఖులు
నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్, కనిమొళి, అన్నామలై, సర్బానంద సోనోవాల్, అర్జున్ మేఘ్వాల్, ఎల్.మురుగన్, బిప్లవ్ కుమార్ దేవ్, తమిళసై సౌందరరాజన్, గౌరవ్ గొగొయ్, జితిన్ ప్రసాద, జీతన్ రామ్ మాంఝీ, నకుల్నాథ్ తదితరులు.
ప్రభుత్వాన్ని నిర్ణయించేది మీరే.. సీఈసీ సందేశం
తొలిదశ పోలింగ్ వేళ ఓటు ప్రాధాన్యాన్ని వివరిస్తూ భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఓటు వేయడానికి మించింది లేదని పేర్కొంటూ.. యువత పెద్దఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘మన గొప్ప ప్రజాస్వామ్యంలో.. ప్రభుత్వాన్ని నిర్ణయించేది మీరే. మీ దేశం, ప్రాంతం, కుటుంబం, మీ భవిష్యత్తు కోసమే ఈ ఎన్నికలు. ఒక్క ఓటే కదా అని తక్కువ అంచనా వేయొద్దు. ఎన్నికల సమరంలో ఒక్క ఓటూ కీలకంగా మారిన సందర్భాలు ఉన్నాయి’’ అని ఓటర్లను ఉద్దేశించి సీఈసీ పేర్కొన్నారు. వడగాలుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి తాపాన్ని భారత ఓటర్ల స్ఫూర్తి జయిస్తుందని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది