Punjab: 12వేల మంది కాంట్రాక్టు టీచర్ల రెగ్యులరైజ్.. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు బస్సులు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12వేల మందికి పైగా కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు.
చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 12,710మంది ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించింది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన పత్రాలను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎంతో చారిత్రాత్మకమైందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ త్వరలోనే బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 20వేల మంది విద్యార్థులకు (12వేల మంది బాలికలు; 8వేల మంది బాలుర)కు ఈ సర్వీసులను అమలు చేస్తామని తెలిపారు. బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి తమ విద్యను పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఈ పథకం చేపడుతున్నామని సీఎం చెప్పారు. ఈ బస్సుల్లో జీపీఎస్ డివైజ్లను సైతం అమర్చనున్నట్టు చెప్పిన సీఎం.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ట్రాక్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
సీఎం మాన్ భావోద్వేగం
టీచర్లకు ఉద్యోగ భద్రత ఉంటేనే విద్యార్థుల జీవితాలను మార్చగలరనే ఉద్దేశంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి భగవంత్ మాన్ ఒప్పంద టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడంపై దృష్టిసారించారు. ఇందులో ఉన్న చట్టపరమైన, పరిపాలనాపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు కృషిచేశారు. తన ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించడంపై ఓ ఉపాధ్యాయుడు కన్నీళ్లతో సీఎంను ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు చెప్పారు. దీంతో సీఎం మాన్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని.. ఆ వర్గం ఎదుర్కొనే ఇబ్బందులేంటో తనకు తెలుసన్నారు. గత ప్రభుత్వాల పాలకులు పట్టించుకోని కారణంగానే టీచర్లు చాలీచాలని వేతనాలతో పనిచేయాల్సి వచ్చిందని.. చట్టబద్ధమైన హక్కుల కోసం కూడా నిరసనలు చేయాల్సిన పరిస్థితి రావడం రాజభవనాల్లో నివసించే నేతలు (ఎవరి పేరునూ ప్రస్తావించలేదు) ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని.. వాళ్లకు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలియవన్నారు. ఉపాధిహామీ పనులకు వెళ్తున్నవారికి కూడా టీచర్ల కన్నా ఎక్కువ వేతనం వచ్చే పరిస్థితి ఇదివరకు ఉండేదన్నారు.
భారీగా పెరిగిన వేతనాలు
ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం.. టీచర్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెరిగాయి. ఇదివరకు పంజాబ్లో అసోసియేట్ టీచర్లకు నెలకు రూ.9500ల చొప్పున వేతనం ఉండగా.. ఇప్పుడది రూ.20,500లకు పెరగనుంది. అలాగే, ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్, నర్సరీ టీచర్ ట్రైనింగ్ అర్హత కలిగిన టీచర్లకు రూ.10,250 నుంచి రూ. 22వేలు; బీఏ/ఎంఏ బీఈడీ డిగ్రీలు కలిగిన ఉపాధ్యాయులకు రూ. 11వేలు నుంచి రూ.23,500లకు వేతనాలు పెరగనున్నాయి. ఏటా 5శాతం ఇంక్రిమెంట్తో పాటు ఇతర సౌకర్యాలను కూడా ఉపాధ్యాయులకు ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. ఉపాధ్యాయులకు కేవలం బోధనాపరమైన వ్యవహారాలకే తప్ప నాన్టీచింగ్ డ్యూటీని కేటాయించరాదని ఇదివరకే తమ ప్రభుత్వం నిర్ణయించిందని మాన్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి