లంగ్స్పై కరోనా ప్రభావం..శాస్త్రవేత్తల డీ-కోడ్..!
ఊపిరితిత్తుల కణాలను ఈ కరోనా వైరస్ ఎలా దెబ్బతీస్తోందన్న విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు డీకోడ్ చేయగలిగారు.
బోస్టన్: కరోనా వైరస్ సోకిన తర్వాత శరీరంలో వివిధ అవయవాలపై ఆ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే, కరోనా వైరస్ ఊపరితిత్తులను ఎలా నష్టపరుస్తోందన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు, ఊపిరితిత్తుల కణాలను ఈ కరోనా వైరస్ ఎలా దెబ్బతీస్తోందన్న విషయాన్ని డీకోడ్ చేయగలిగారు. దీంతో కరోనా వైరస్ను ఎదుర్కొనే చికిత్సను రూపొందించడంలో తాజా పరిణామం దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం మాలిక్యులార్ సెల్ జర్నల్లో ప్రచురితమైంది.
కరోనాకు కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ ఊపిరితిత్తుల్లో ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తుందని తెలుసుకునేందుకు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (బీయూఎస్ఎం) శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. ఇందుకోసం స్పెక్ట్రోమెట్రీ సాంకేతిక సాయంతో ఊపిరితిత్తుల్లోని కణాల శాంపిళ్లలోని అణువులను వర్గీకరించి విశ్లేషించారు. సార్స్-కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తుల్లోని కణాలు, ప్రోటీన్ల మార్గంలో మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఫాస్ఫోరైలేషన్ అని పిలిచే కీలక ప్రోటీన్ మార్పును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దేహంలోని కణాల్లో ప్రోటీన్ పనితీరును నియంత్రించడంలో ఈ ఫాస్ఫోరైలేషన్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది.
అయితే, కరోనా వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తుల కణాలను గందరగోళ పరచడం, ప్రోటీన్లలోని పనితీరులో మార్పులకు కారణమవుతుంది. ఈ మార్పులు ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ కణాలు రెట్టింపు కావడానికి కారణమవడంతో పాటు భారీ స్థాయిలో అక్కడి కణాలను నష్టపరుస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా సాధారణంగా కణాల పెరుగుదలకు కావాల్సిన వనరులను వినియోగించుకొని కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇలా కరోనా వైరస్ కణాలు మరికొన్ని కణాలకు సోకుతూ తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా వైరస్ సోకని, వైరస్ నిర్ధారణ ఐన వ్యక్తుల ఊపరితిత్తులను పనితీరును పరిశీలించారు. వైరస్ నిర్ధారణ అయిన 24గంటల తర్వాత ఊపిరితిత్తుల కణాల్లో జరిగే మార్పులను నిశితంగా గమనించారు. తద్వారా వైరస్ సోకిన వారిలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఊపిరితిత్తుల నష్టాన్ని నివారించడంలో తాజా పరిశోధన ఫలితాలు ఎంతో దోహదపడుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వ్యాధి నిర్ధారణ, నూతన చికిత్సా విధానాన్ని కనుగోవడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న 18రకాల ఔషధాలు కొవిడ్ చికిత్సలో వినియోగించుకునే వీలుంటుందని సూచించారు.
ఇవీ చదవండి..
అమెరికాలో టీకా పంపిణీ మొదలు.. కానీ
భారత్లో జనవరిలో వ్యాక్సినేషన్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి