Emergency landing: హిమాచల్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. 

Published : 10 Aug 2023 17:12 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ సుఖు(Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu) ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. గురువారం బిఠాల్‌ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ దిగింది. ఆ సమయంలో సీఎంతో పాటు ప్రజా పనుల శాఖ మంత్రి, ఓ ఎమ్మెల్యే, సీఎం ప్రెస్ సెక్రటరీ ఉన్నారు.

వాస్తవంగా జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ప్రాజెక్టుకు చెందిన ప్రాంతంలో నిర్మించిన హెలిప్యాడ్‌పై అది ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ దానికి 500 మీటర్ల దూరంలో అత్యవసరంగా దిగినట్లు వార్తాకథనాలు వెల్లడించాయి. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే హెలికాప్టర్‌లో ఉన్న అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని