Air India Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది.
బెంగళూరు: బెంగళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం శనివారం రాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంజిన్లో మంటలు చెలరేగడమే అందుకు కారణం. 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.
బెంగళూరు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సిబ్బంది మంటల్ని గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారమిచ్చారు. దీంతో ఎయిర్పోర్టులో అత్యవసర ఏర్పాట్లు చేశారు. రాత్రి 11:12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండయ్యింది. మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తూనే సిబ్బంది ఎమర్జెన్సీ ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
ఎట్టకేలకు రన్వేపై క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఈ క్రమంలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికే ఫైరింజన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. విమానం ఆగిన వెంటనే మంటలను ఆర్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను రన్వే నుంచి ఎయిర్పోర్టు లోపలికి తీసుకెళ్లారు.
జరిగిన ఘటనపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విచారం వ్యక్తం చేసింది. నియంత్రణా సంస్థలతో కలిసి దర్యాప్తు చేస్తామని తెలిపింది. మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలసుకుంటామని పేర్కొంది. శుక్రవారం దిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఏసీలో మంటలు రావటంతో వెంటనే దిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు బెయిల్ పొడిగించాలని సుప్రీంను అభ్యర్థించిన నేపథ్యంలో భాజపా నేత, సీఎం ఇంటికి అంబులెన్స్ పంపడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. -
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
ఇంటి పెద్దదిక్కు కన్ను మూసినా.. ఓటును హక్కును మరవలేదు బిహార్లోని ఓ కుటుంబం. ఓటు బాధ్యతను నిర్వర్తించాకే.. అంత్యక్రియులు నిర్వహించింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును దిల్లీకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. దాంతో రేపు ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
Prajwal Revanna: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. -
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్కు చెందిన ఖలీల్ అన్సారీ.. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. 15 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గంలో ఉంది. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. -
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
బ్రాంచ్ ఫొటో తీసి, ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఎస్బీఐ(SBI) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
ఓ అల్లరి మూక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటన పశ్చిమ బెంగాల్ కుల్తాలీ గ్రామంలో చోటుచేసుకుంది. -
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు. -
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
Nagpur Temperature: నాగ్పుర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది. -
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది. -
ఎయిరిండియా విమానం 24 గంటలు ఆలస్యం.. ఉక్కపోతతో స్పృహతప్పిన ప్రయాణికులు
దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. -
మలద్వారంలో 960 గ్రాముల బంగారం.. కేరళలో ఎయిర్హోస్టెస్ అరెస్ట్
కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి బంగారం అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. -
సుప్రీం కొలీజియం నిర్ణయాల్లో జోక్యానికి దిల్లీ హైకోర్టు నిరాకరణ
హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సిఫార్సులను నిరాకరించడానికి కారణాలేమిటో సుప్రీంకోర్టు కొలీజియం సవివరంగా తెలియజేసేలా ఆదేశించాలని కోరుతూ రాకేశ్కుమార్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. -
150 ఏళ్లుగా రుతుపవనాల రాకలో మార్పులు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) లెక్కల ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతూనే ఉంది. మొదటిసారి 1918లో మే 11న ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
-
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
-
40 శాతం కమీషన్ కేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్లకు బెయిల్
-
ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు