Amit Shah: ‘వారి ప్రేమలే పార్టీలను చీల్చాయి’: ఎన్సీపీ, శివసేన చీలికలపై అమిత్ షా
శివసేన, ఎన్సీపీలో వచ్చిన చీలికలపై భాజపా అగ్రనేత అమిత్ షా (Amit Shah) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
దిల్లీ: శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలికలకు తాము కారణం కాదని భాజపా(BJP) అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ‘న్యూస్ 18’ ఆధ్వర్యంలోని రైజింగ్ భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీలను చీలుస్తున్నారని మాపై ఆరోపణలు చేసేవారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray)కు ఉన్న ‘పుత్ర ప్రేమ్’(కుమారుడిపై ప్రేమ).. శివసేన రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమైంది. ఏక్నాథ్ శిందే అర్హతకు తగ్గట్టుగా బాధ్యతలు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ఎన్సీపీ విషయానికి వస్తే.. శరద్ పవార్(Sharad Pawar) ‘పుత్రి ప్రేమ్’(కూతురిపై ప్రేమ) దానిని చీల్చింది. అజిత్ పవార్కు సముచిత గౌరవం దక్కితే.. ఆయన బయటకు వచ్చేవారే కాదు’ అని అమిత్ షా విశ్లేషించారు.
భాజపా నిరాకరిస్తే.. స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో కలిసి శివసేన, ఎన్సీపీ (ఎంవీఏ) మహరాష్ట్ర(Maharashtra)లో అధికారంలోకి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2022లో ఏక్నాథ్ శిందే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బయటకు వెళ్లి, భాజపాతో చేతులు కలిపారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. భాజపా, శివసేన(శిందే వర్గం) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. గత ఏడాది అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి.. తన మద్దతుదారులతో కలిసి భాజపా ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఇదిలాఉంటే.. తమ కూటమి మహారాష్ట్రలో 40కు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని సీట్ల సర్దుబాటు సందర్భంగా అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వికసిత్ భారత్ సాధనకు రాష్ట్రాల సహకారం చాలా ముఖ్యం: నీతి ఆయోగ్
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారని సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
అమానుషం.. ఆస్తి తగాదాలో బాలికపై బిల్డర్ దాడి!
ఆస్తి కోసం జరిగిన తగాదాలో ఓ బాలిక పట్ల బిల్డర్ అమానుషంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేయడంతో ఆరడగుల ఎత్తు నుంచి కిందికి పడిపోయింది. -
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
రైల్వేశాఖ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. -
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ నిర్ణయం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం: ఫిలిం ఛాంబర్
-
5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒక్క రోజే 28 లక్షలు
-
విస్తారా కీలక నిర్ణయం.. ఆ విమానాల్లో 20 నిమిషాలు ఫ్రీ వైఫై..!
-
‘మహారాజ’ ఆ ట్విస్ట్కు ‘దిమ్మతిరిగి మబ్బులు మెరిసిపోతాయి’..
-
కమల రాక.. తగ్గిన ట్రంప్ ఆధిక్యం!
-
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పేరుతో.. రూ.3.25 కోట్ల మోసం