West Bengal: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు.. 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు
West Bengal: కలకత్తా హైకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. బెంగాల్లో 2010 తర్వాత జారీ అయిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ (West Bengal CM) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు (Calcutta High Court).. బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాల (OBC Certificates)ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
2012 నాటి పశ్చిమబెంగాల్ (West Bengal) వెనకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టంచేసింది.
ప్రచారాల తీరుపై ఈసీ కన్నెర్ర.. భాజపా, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు
అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నింటిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది.
తీర్పుపై దీదీ అసహనం..
హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసంతృప్తి వ్యక్తంచేశారు. దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. ‘‘ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇప్పుడు భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నింది. ఈ తీర్పును మేం అంగీకరింబోం. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయి’’ అని దీదీ స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్కు దిల్లీ కోర్టు నోటీసులు
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో విషయంలో సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal)కు దిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. -
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ సీనియర్ల నుంచి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి వివాదాస్పదం కావడంతో తాజాగా వివరణ వచ్చింది. -
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
భాజపాతో ఆరెస్సెస్కు విభేదాల్లేవు.. సంఘ్ వర్గాల వెల్లడి
భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. -
అమెరికాలో వర్క్ పర్మిట్దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. -
యడియూరప్పకు కోర్టులో ఊరట
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. -
నీట్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేంద్ర మంత్రి సోమణ్ణ కుమారుడిపై కేసు
రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. -
బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్
ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ని ఒక స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. శివానీ వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్ తీసుకొచ్చిన టూల్ను ‘దివ్య దృష్టి’ పేరుతో పిలుస్తున్నారు. -
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది
యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు. -
చాంద్నీ చౌక్లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర దిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. -
షీనాబోరా అస్థికలు మాయం
ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’
భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్పుర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. -
తేనెటీగల దాడి.. పీపీఈ కిట్లుధరించి దహన సంస్కారాలు
తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఝార్ఖండ్లో రూ.2 లక్షల వరకూ రైతు రుణాల మాఫీ
రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు. -
పత్రికాస్వేచ్ఛను అడ్డుకొనే చట్టాలు ఉపసంహరించుకోండి
పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. -
నీట్ పరీక్షలో అక్రమాలు.. గుజరాత్లో ఐదుగురి అరెస్టు
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్లోని పంచ్ మహల్ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్టు చేశారు. -
కువైట్ అగ్నిప్రమాదం.. భారత్కు చేరిన 45 మృతదేహాలు
కువైట్లోని అల్ మంగాఫ్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్కు చేరుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్డీయే మైనార్టీ సర్కార్... అయితే కొనసాగాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
-
‘ఆ వీడియో తొలగించండి’: సునీతా కేజ్రీవాల్కు దిల్లీ కోర్టు నోటీసులు
-
మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: కమిషన్కు కేసీఆర్ లేఖ
-
పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
-
అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్ తీసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త
-
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత