Reckless driving: ‘ఫుట్‌రెస్ట్‌పై బాలుడిని నిలబెట్టి’.. పేరెంట్స్‌ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం

నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు రోడ్లపై ఓ జంట తమ కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫుట్‌రెస్ట్‌పై బాలుడిని నిలబెట్టి ప్రయాణించిన వీడియో వైరల్‌గా మారింది.

Updated : 17 Apr 2024 16:49 IST

బెంగళూరు: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై కొందరు చేసే సరదా పనులు, వారి ప్రవర్తన.. చూసే వారికి ఆగ్రహం తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఓ సంఘటన బెంగళూరు (Bengaluru) రోడ్డుపై కనిపించింది. చిన్నారిని బైక్‌ ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి తీసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రమాదకర రీతిలో చిన్నారిని నిలబెట్టడం ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణికి అద్ధం పడుతోంది.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు లక్షమందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. దంపతుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ సంఘటనను చూస్తుంటే మాటలు రావడం లేదు.. ఇలా ఎవరైనా చేయగలరా?’’ అని ఒకరు.. ‘‘తమ చిన్నారిని ప్రమాదంలో పడేలా వ్యవహరించిన వీరిపై చర్యలు చేపట్టాలి’’ అని మరొకరు పోస్టు పెట్టారు. ‘‘ఇది వారికే కాక.. ఇతరులకు కూడా ప్రమాదమే’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై నగర ట్రాఫిక్‌ పోలీసులు స్పందించినట్లు తెలుస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని