మండుటెండలో అప్పడం కాల్చిన జవాన్.. వీడియో వైరల్
మండే ఎండలకు వెరవకుండా విధులు నిర్వర్తిస్తోన్న సైనికులపై అస్సాం ముఖ్యమంత్రి(Himanta Biswa Sarma ) కృతజ్ఞత చాటుకున్నారు.
దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాల్లో ఆ తీవ్రత ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో ఒక జవాన్ ఇసుకలో అప్పడాన్ని కాల్చుతున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. దీనిని షేర్ చేస్తూ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ ఒకరు రాజస్థాన్లోని బికనేర్ విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అతడు ఒక అప్పడాన్ని తీసుకొని దానిపై ఇసుక కప్పేశారు. కొద్దిసేపటి తర్వాత, ఇసుకను తొలగించి దానిని తీసి చూస్తే.. అచ్చం స్టవ్ మీద వేయించినట్టుగా కనిపించింది. అప్పుడు ఆ ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత 47 డిగ్రీల మేర ఉంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియో సీఎం హిమంత బిశ్వశర్మ దృష్టిలో పడింది. ‘‘ఎలాంటి అసాధారణ పరిస్థితులకైనా వెరవకుండా, దేశం కోసం సేవలు అందిస్తోన్న జవాన్లను చూసి.. నా హృదయం కృతజ్ఞత, గౌరవంతో నిండిపోయింది’’ అని బీఎస్ఎఫ్ ఇండియాను ట్యాగ్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సైనికులపై తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేస్తున్నారు. హీట్వేవ్ను పట్టించుకోకుండా సైన్యం తన విధులు నిర్వర్తిస్తోందని కొనియాడారు. రాజస్థాన్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతాల్లో బికనేర్ కూడా ఒకటి. ఈసారి అక్కడ 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది
యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు. -
చాంద్నీ చౌక్లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర దిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
షీనాబోరా అస్థికలు మాయం
ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’
భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్పుర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. -
తేనెటీగల దాడి.. పీపీఈ కిట్లుధరించి దహన సంస్కారాలు
తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
ఝార్ఖండ్లో రూ.2 లక్షల వరకూ రైతు రుణాల మాఫీ
రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు. -
పత్రికాస్వేచ్ఛను అడ్డుకొనే చట్టాలు ఉపసంహరించుకోండి
పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. -
నీట్ పరీక్షలో అక్రమాలు.. గుజరాత్లో ఐదుగురి అరెస్టు
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్లోని పంచ్ మహల్ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్టు చేశారు. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
కువైట్ అగ్నిప్రమాదం.. భారత్కు చేరిన 45 మృతదేహాలు
కువైట్లోని అల్ మంగాఫ్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్కు చేరుకున్నాయి. -
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
నీట్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
సంక్షిప్త వార్తలు (11 )
ఒడిశా సీఎంగా ఎన్నికైన భాజపా నేత మోహన్ చరణ మాఝి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనల కోసం అభ్యర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
ఉప ఎన్నిక బరిలో ‘దర్శన్’ను దించాలనుకున్న డీకే బ్రదర్స్?
చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో దర్శన్ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారని భాజపా వ్యాఖ్యానించింది. -
అమిత్షా ఎఫెక్ట్.. తమిళిసైతో అన్నామలై భేటీ
భాజపా సీనియర్ నేత తమిళిసైతో తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై భేటీ అయ్యారు. -
బెట్టింగ్ ముఠాపై దాడులు.. రూ.14.6 కోట్లు స్వాధీనం
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రెండు బెట్టింగ్ ముఠా స్థావరాలపై గురువారం దాడులు జరపగా పెద్ద మొత్తంలో డబ్బులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పట్టబడ్డాయి.