పైరసీకి చెక్ పెట్టేలా కేంద్రం కీలక అడుగు.. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేబినెట్ ఓకే
Cinematography bill: సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పైరసీని అరికట్టడం, వయసుల వారీ సినిమాల వర్గీకరణలో మార్పులతో సవరణ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
దిల్లీ: సినిమా పైరసీని (Piracy) అరికట్టే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇంటర్నెట్లో పైరేటెడ్ కంటెంట్ను అడ్డుకొనేందుకు కొత్తగా సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు 2023ను (Cinematograph Amendment Bill 2023) తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. తదుపరి సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం U, A, UA పేరిట వయసుల వారీ సినిమా వర్గీకరణ విధానాన్నీ మార్చనున్నట్లు ఠాకూర్ తెలిపారు.
సవరణ బిల్లును తీసుకొచ్చే ముందు భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ‘‘పరిశ్రమ కోరుకుంటున్నవన్నీ ఈ బిల్లులో ఉన్నాయి. వారి అంచనాలకు అనుగుణంగా ఈ బిల్లు ఉంటుంది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ బిల్లు సంతృప్తి పరుస్తుంది’’ అని ఠాకూర్ చెప్పారు. పైరసీ విషయంలో వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నట్లు ఠాకూర్ చెప్పారు. అలాగే, వయసుల వారీ వర్గీకరణ విధానంతో పాటు ప్రస్తుత చట్టంలోని కొన్ని అవసరమైన మార్పులు చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఉత్తమ విధానాలకు అనుగుణంగా ఈ బిల్లు ఉండబోతోందని చెప్పారు. బిల్లుకు సంబంధించి ఇంతకు మించిన విషయాలేవీ ఠాకూర్ వెల్లడించలేదు. పార్లమెంట్లో ప్రవేశపెట్టాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల ముంబయిలో జరిగిన ఓ సమావేశంలో సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఇంటర్నెట్లో పైరసీ గురించి మాట్లాడారు. దీనిపై త్వరలో ఓ బిల్లును కేంద్రం తీసుకురాబోతోందని చెప్పారు. పైరేటెడ్ కంటెంట్ను ప్రదర్శించే సైట్లను బ్లాక్ చేయబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేబినెట్ సమావేశంలో జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రాజెక్ట్కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందుకు రూ.6,003.65 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా 2023-24 నుంచి 2030-31 మధ్య ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ ఎనిమిదేళ్లలో 50 నుంచి 1,000 ఫిజికల్ క్యూబిట్స్తో క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడిది హరియాణాలోని కర్నాల్ ప్రాంతం. -
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
ఉగ్ర దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ(IAF) సైనికుడు కార్పోరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారాలోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. -
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
అతడు రూ. 15 వేల జీతగాడు. కానీ, అతడి ఇంటిని తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఓ గదిలో గుట్టలుగా పేర్చిన నగదు చూసి షాకైంది. -
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది. -
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
నేడు గుజరాత్లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. -
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన