Maharashtra: ట్రంప్‌ పేరుతో ఫేక్‌ ఆధార్‌.. ఎమ్మెల్యేపై కేసు!

Eenadu icon
By National News Team Published : 30 Oct 2025 11:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పేరుతో ఫేక్‌ ఆధార్‌ సృష్టించారనే ఆరోపణ నేపథ్యంలో ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. శరద్‌పవార్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఇటీవల రోహిత్‌ (MLA Rohit Pawar) విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు ఒక అనధికార వెబ్‌సైట్‌ను ఉపయోగించి రూ.20 కంటే తక్కువకే నకిలీ ఆధార్‌ను ఎలా పొందవచ్చనే దాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో ట్రంప్‌ పేరు, ఫొటోను ఉపయోగించి తన నియోజకవర్గంలోని నివాస చిరునామాతో ఆధార్‌ కార్డును చూపించారు. అయితే, నకిలీ ఆధార్‌ కార్డులు ఎలా పుట్టుకొస్తున్నాయో బహిర్గతం చేసేందుకే తాను ఇలా చేశానని రోహిత్‌ పేర్కొన్నారు. ఈ నకిలీ గుర్తింపుకార్డులతో మహారాష్ట్ర (Maharashtra) ఓటర్ల జాబితాలో నమోదయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. అయితే రోహిత్‌ చర్యలు కాస్త రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే భాజపా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ఆధార్‌ ప్రదర్శన సమయంలో అక్కడ ఉన్న మరికొందరి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంచినట్లు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు