Kejriwal: స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి జరిగిన ఘటనపై ఆ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ (Swati Maliwal)పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యక్తిగత సహాయకుడు బిభవ్కుమార్ దాడి చేసిన ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేజ్రీవాల్ బుధవారం తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు ఆమెకు న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
‘‘ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నా. న్యాయం జరగాలి. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయి. ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున.. ఏమీ మాట్లాడలేను’’ అని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
నా వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు: స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణలు
సీఎం కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో ఎదురుచూస్తున్న స్వాతితో.. బిభవ్కుమార్ అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ను అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు నిందితుడిని ముంబయికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న నిందితుడి ఫోన్లు, ల్యాప్టాప్లు, సీసీటీవీ రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని స్వాతి మాలీవాల్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలు జరిగితే ఎన్టీఏను జవాబుదారీ చేస్తాం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను తమ ప్రభుత్వం సహించబోదని, ఒక వేళ లోపాలు జరిగినట్లు తేలితే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని జవాబుదారీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. -
బుల్లెట్ రైలులో ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ
బుల్లెట్ రైలు సేవలను సురక్షితంగా నిర్వహించేందుకు ఆటోమేటెడ్ వర్షపాత పర్యవేక్షణ వ్యవస్థ(రెయిన్ఫాల్ మానిటరింగ్ సిస్టమ్)ను అవలంబిస్తున్నామని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. -
శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు
యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. -
త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల కమిటీ నివేదిక
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. -
భాజపాతో ఆరెస్సెస్కు విభేదాల్లేవు.. సంఘ్ వర్గాల వెల్లడి
భాజపాతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఎటువంటి విభేదాల్లేవని సంబంధిత వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. -
అమెరికాలో వర్క్ పర్మిట్దారుల పిల్లలను ఆదుకోండి
అమెరికాకు వర్క్పర్మిట్పై వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు 21 ఏళ్లు నిండగానే వారివారి దేశాలకు తిప్పిపంపేయకుండా తక్షణం రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు 43 మంది శాసనకర్తలు విజ్ఞప్తి చేశారు. -
యడియూరప్పకు కోర్టులో ఊరట
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను అరెస్టు చేయవద్దని సదాశివనగర పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. -
నీట్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
కేంద్ర మంత్రి సోమణ్ణ కుమారుడిపై కేసు
రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ కుమారుడు అరుణ్, ఆయన సహచరుడు ప్రమోద్రావుపై బెంగళూరు సంజయనగర ఠాణాలో కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. -
బహుముఖాలను గుర్తించే ఏఐ టూల్
ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో బహుముఖాలను గుర్తించగలిగేలా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్ని ఒక స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. శివానీ వర్మ అనే మహిళ నేతృత్వంలోని ఈ స్టార్టప్ తీసుకొచ్చిన టూల్ను ‘దివ్య దృష్టి’ పేరుతో పిలుస్తున్నారు. -
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది
యాత్రికుల బస్సు లోయలో పడినా, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారని జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన ఓ బాధితురాలు వాపోయారు. -
చాంద్నీ చౌక్లో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర దిల్లీలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. -
షీనాబోరా అస్థికలు మాయం
ఇరవై నాలుగేళ్ల షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న మృతురాలి అస్థికలు మాయమైనట్లు దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’
భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్పుర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది. -
తేనెటీగల దాడి.. పీపీఈ కిట్లుధరించి దహన సంస్కారాలు
తేనెటీగలు దాడి చేయడంతో పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఝార్ఖండ్లో రూ.2 లక్షల వరకూ రైతు రుణాల మాఫీ
రైతులకు గల రూ.రెండు లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయమంత్రి బాదల్ పత్రలేఖ శుక్రవారం వెల్లడించారు. -
పత్రికాస్వేచ్ఛను అడ్డుకొనే చట్టాలు ఉపసంహరించుకోండి
పత్రికాస్వేచ్ఛను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న చట్టాలను ఉపసంహరించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. -
నీట్ పరీక్షలో అక్రమాలు.. గుజరాత్లో ఐదుగురి అరెస్టు
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను శుక్రవారం గుజరాత్లోని పంచ్ మహల్ జిల్లాలోని గోధ్రా పోలీసులు అరెస్టు చేశారు. -
కువైట్ అగ్నిప్రమాదం.. భారత్కు చేరిన 45 మృతదేహాలు
కువైట్లోని అల్ మంగాఫ్లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్కు చేరుకున్నాయి. -
సంక్షిప్త వార్తలు (11 )
ఒడిశా సీఎంగా ఎన్నికైన భాజపా నేత మోహన్ చరణ మాఝి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు సలహాలు, సూచనల కోసం అభ్యర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
ఉప ఎన్నిక బరిలో ‘దర్శన్’ను దించాలనుకున్న డీకే బ్రదర్స్?
చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో దర్శన్ను పోటీ చేయించేందుకు డీకే సోదరులు ప్రణాళిక వేశారని భాజపా వ్యాఖ్యానించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
-
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
-
రెస్కో.. అవినీతి చూస్కో
-
‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం!
-
పవన విద్యుత్తు వైపు.. సింగరేణి చూపు..