CAA: సీఏఏను కేరళలో అమలుచేయబోం.. సీఎం విజయన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలు విపక్షాలు మండిపడుతుండగా.. అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మత విభజన సృష్టించే ఈ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ సీఎం విజయన్ తేల్చి చెప్పారు.
తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని నోటిఫై చేయడంపై రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కేంద్రం చర్యపై ప్రతిపక్ష నేతలు మండిపడుతుండగా.. అధికార పార్టీకి చెందినవారు ప్రశంసిస్తున్నారు. సీఏఏను దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టంగా కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రం కేరళలో దీన్ని అమలుచేయబోమని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ఇప్పటికే తమ ప్రభుత్వం పదేపదే చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని కోరారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశానికి వ్యతిరేకమైనది.. దీనిపై ప్రజలు లోక్సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. వివాదాస్పదమైన ఎన్నికల బాండ్ల అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. సీఏఏ అమలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అధికార భాజపా ప్రతి అంశాన్నీ హిందువులు, ముస్లింల మధ్య విభజనగా తీసుకొస్తుందని ఆరోపించారు.
సీఏఏ అమలు చరిత్రాత్మకం.. యోగి ఆదిత్యనాథ్
సీఏఏ అమలుపై కేంద్రం నిర్ణయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వాగతించారు. మానవతతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నందుకు యోగి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో సీఏఏ అమలు చరిత్రాత్మకమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. మోదీ గ్యారంటీ అంటే అర్థం ప్రతి హామీనీ కచ్చితంగా సాకారం చేయడమేనని చౌహాన్ పేర్కొన్నారు.
ఆ ప్రశ్నకు భాజపా సమాధానం చెప్పాలి: అఖిలేశ్
జీవనోపాధి కోసం మన పౌరులే విదేశీబాట పడుతుంటే ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం వస్తుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. భాజపా రాజకీయ నాటకాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. గత పదేళ్లలో లక్షలాది మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల అంశంపై రేపేం జరుగుతుందో గానీ.. ‘కేర్ ఫండ్’ ఖాతా వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది అని అఖిలేశ్ పేర్కొన్నారు.
అమల్లోకి ‘సీఏఏ’.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
న్యాయపోరాటం చేస్తాం.. ఏఏఎస్యూ
కేంద్రం నిర్ణయంపై అస్సాంలోని పలు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యూ) పేర్కొంది. మరోవైపు, సీఏఏ నోటిఫికేషన్ దురదృష్టకరమని కాంగ్రెస్ నేత, అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా అన్నారు. అక్రమంగా ఉన్న విదేశీయులంతా అస్సాంను విడిచి వెళ్లాల్సిందేనని 2016 నుంచి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా చెబుతూనే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసేలా ఇప్పుడు సీఏఏ అమలుచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇందుకు అస్సాం ప్రజలకు ప్రధాని మోదీ, భాజపా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల బాండ్ల అంశంపై దృష్టి మళ్లించేందుకే..
ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఎన్నికల వేళ మతపరమైన సమీకరణాల్ని ప్రోత్సహించే వ్యూహంలో భాగంగానే భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలుపై ఈ నిర్ణయం తీసుకుందని ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ విమర్శించారు. ‘ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో భాజపా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఏ దారీ కనబడలేదు. అందుకే ఆ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం సీఏఏ నిబంధనలు విడుదల చేసింది’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్