US Ambassador: భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

US Ambassador: భవిష్యత్తును చూడాలనుకునేవారు భారత్‌కు రావాలని మన దేశంలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు.

Updated : 10 Apr 2024 10:37 IST

దిల్లీ/వాషింగ్టన్‌: మన దేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా (USA) రాయబారి ఎరిక్‌ గార్సెట్టి (Eric Garcetti) ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్‌ (India) కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మీరు భవిష్యత్తును చూసి ఆస్వాదించాలనుకుంటే.. అందుకోసం పనిచేయాలనుకుంటే భారత్‌కు రండి. ఈ దేశంలో అమెరికా దౌత్య కార్యాలయానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా’’ అని గార్సెట్టి తెలిపారు. భారత్‌తో భాగస్వామ్య బంధానికి అమెరికా ఎంతో విలువనిస్తుందని తెలిపారు. ‘‘మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు. నేర్చుకోవడానికి వచ్చాం’’ అంటూ ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను నొక్కి చెప్పారు.

కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం.. నిఘా నివేదికలో వెల్లడి!

భారత్‌-అమెరికా బంధం కొత్త శిఖరాలకు..

భారత్‌, అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని అగ్రరాజ్య జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ అన్నారు. సాంకేతికత, భద్రతతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోందని వైట్‌హౌస్‌ మీడియా సమావేశంలో తెలిపారు. అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడిపై అభియోగాలు రావడం.. ఇరు దేశాల మధ్య బంధంపై ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ సలివాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఈ కేసుపై దిల్లీలోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి మాట్లాడుతూ.. దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని