రెండు టీకాలు సురక్షితమైనవే..!
స్వదేశంలో అభివృద్ది చేసిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డాయని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్ క్యాడిలా, స్పుత్నిక్-వి, బయోలాజికల్-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను..
స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: స్వదేశంలో అభివృద్ది చేసిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డాయని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్ క్యాడిలా, స్పుత్నిక్-వి, బయోలాజికల్-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా.. మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
టీకాలపై ప్రజలకు ఎటువంటి సందేహాలు లేకుండా, స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రెండు మోతాదుల్లో టీకాలు తీసుకున్న రెండు వారాల వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పంపిణీ సమయంలో ఇతర ఆరోగ్య కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో జరుగుతోందని తెలిపిది. ఈ నేపథ్యంలో ప్రజల సహకారం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే సేకరించిన కరోనా వ్యాక్సిన్ల ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి 1.1కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను సేకరిస్తుండగా, డోసు ధర రూ.200గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ 55లక్షల డోసులను తీసుకుంటుండగా, వీటిలో 38.5లక్షల డోసుల్లో ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, మరో 16.5లక్షల డోసులను భారత్ బయోటెక్ ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే డోసుకు రూ.200..
దేశంలోవ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ఒక్కో డోసు రూ.200కు అందిస్తున్నామని అదర్ పూనావాలా స్పష్టంచేశారు. సీరం నుంచి వ్యాక్సిన్ల రవాణా చారిత్రత్మక ఘట్టం అని, దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ అందివ్వడమే తమ ముందున్న సవాల్ అని అదర్ పూనావాలా అభిప్రాయపడ్డారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదిస్తున్నాయని.. వీరిలో ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నం జరుగుతోందని అదర్ పూనావాలా తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లన్నీ చకచక కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు టీకాలను సరఫరా చేస్తున్నారు. సీరం తయారుచేస్తోన్న కొవిషీల్డ్ టీకాలను దేశంలో 12నిర్దేశిత కేంద్రాలకు పుణె నుంచి ప్రత్యేక విమానాల్లో చేరవేస్తున్నారు. 3.72లక్షల కొవిషీల్డ్ టీకాలు హైదరాబాద్ చేరుకున్నాయి. తొలివిడతలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీరికి ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇవీ చదవండి..
హెర్డ్ ఇమ్యూనిటీ ఈ ఏడాది అసాధ్యమే!
4కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!