Brij Bhushan: ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌ పిటిషన్‌

మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్‌ భూషణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది.

Updated : 18 Apr 2024 17:55 IST

దిల్లీ: జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Singh)పై నమోదైన లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో దిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ, ఈ వ్యవహారంపై మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్‌ భూషణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని బ్రిజ్‌ భూషణ్‌ పిటీషన్‌లో పేర్కొన్నారు. 2022 సెప్టెంబరు 7న డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి వెళ్లినప్పుడు నేరం జరిగిందని రెజర్లు ఆరోపిస్తున్నారు. కానీ, వారు చెప్పిన తేదీల్లో తాను అసలు దేశంలోనే లేనప్పుడు నేరం ఎలా జరుగుతుందన్నారు. ఈ కేసులో నాటి కాల్‌ డిటైల్‌ రికార్డ్స్‌ (CDR)పై తాను ఆధారపడినట్లు తెలిపారు. అయితే, పోలీసులు మాత్రం ఈ సీడీఆర్‌ను రికార్డుల్లో చూపించలేదని ఆయన తరఫున న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మరింత విచారణ జరపాలని కోర్టుకు విన్నవించారు.

బెయిల్‌ కోసం.. కేజ్రీవాల్‌ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

ఈ నేపథ్యంలో తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి.. ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. బ్రిజ్‌ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని దేశంలోని ప్రముఖ మహిళా రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెజ్లింగ్‌ వ్యవహారాల నుంచి బ్రిజ్‌ భూషణ్‌ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని