Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. వివాహానికి హాజరయ్యేందుకు బెయిల్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆప్‌ నేత సిసోదియా(Manish Sisodia)కు తాత్కాలిక ఉపశమనం దక్కింది.  

Published : 12 Feb 2024 18:26 IST

దిల్లీ: ఆప్‌ సీనియర్ నేత మనీశ్‌ సిసోదియా(Manish Sisodia)కు స్వల్ప ఊరట లభించింది. సోమవారం దిల్లీ కోర్టు ఆయనకు మూడు రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరుచేసింది. తన తోబుట్టువు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కోర్టు నుంచి ఈ ఉపశమనం దక్కింది.

బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు

మద్యం కుంభకోణం(Liquor scam)  కేసులో సిసోదియా ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సీబీఐ, ఈడీ ఆయన్ను విచారిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహార్‌ జైల్లో ఉన్నారు. ఈక్రమంలో ఆయన అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతోన్న తన భార్యను వారానికి ఒకసారి పరామర్శించేందుకు కొద్దిరోజుల క్రితం దిల్లీ కోర్టు సిసోదియాకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు