Kejriwal Arrest:: సంక్షేమ పథకాలేవీ ఆగవ్.. ఆ రూమర్స్ నమ్మొద్దు: దిల్లీ సర్కార్ విజ్ఞప్తి
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆప్ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
దిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టుతో నెలకొన్న పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆప్(AAP) సర్కార్ దిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్లానింగ్ డిపార్టుమెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ అరెస్టుతో దిల్లీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నిలిచిపోతాయంటూ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు చేస్తోన్న దుష్ప్రచారంపై ప్రజల్ని అప్రమత్తం చేసింది. నేర పరిశోధన ప్రక్రియలో చట్టం తన పని తాను చేస్తుందని.. పథకాల అమలు, పాలన అనేవి ఎప్పుడూ వ్యక్తులకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సామాన్య ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ప్లానింగ్ విభాగం కార్యదర్శి నిహారికా రాయ్ ప్రకటనలో తెలిపారు. అయితే, సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఈ ప్రకటన వెలువడినట్లు ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు..
గతంలో మాదిరిగానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు, పింఛన్లు తదితర సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుతాయని నిహారిక స్పష్టంచేశారు. ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులతో సంఘటిత నిధి ద్వారా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారని, ఈ డబ్బు ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీల సొంత ఆస్తులు కాదన్నారు. అందువల్ల ముఖ్యమంత్రి అరెస్టు లేదా రిమాండ్తో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అస్సలు ప్రభావమేమీ ఉండదని పేర్కొన్నారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు చేసే ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు కేజ్రీవాల్ను ఈ నెల 21న రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల... -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?