LS Polls: తక్కువ పోలింగ్.. 266 లోక్సభ స్థానాలపై ఈసీ నజర్
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన 266 స్థానాలను గుర్తించింది.
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదైన 266 స్థానాలను గుర్తించింది. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లోనూ జాతీయ సగటు (67.40) కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో ఈసారి అక్కడ ఓట్ల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ముందడుగు వేస్తోంది. సంబంధిత నియోజకవర్గాల సిబ్బందితో శుక్రవారం దిల్లీలో సమావేశమైన ఈసీ అధికారులు.. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు వ్యూహరచన చేశారు.
2019లో తెలంగాణ, బిహార్, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, ఝార్ఖండ్లలో పోలింగ్ శాతం.. జాతీయ సగటు 67.40 శాతంతో పోలిస్తే తక్కువగా నమోదైంది. మొత్తం 266 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదు కాగా.. వాటిలో 215 గ్రామీణ, 51 పట్టణ ప్రాంత స్థానాలు ఉన్నాయి. పోలింగ్ శాతం పెంపు విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఒకే విధమైన వ్యూహం పనిచేయదని, సంబంధిత నియోజకవర్గాలకు అనుగుణంగా రూపొందించాలని భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ సూచించారు.
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
ప్రజలే స్వయంగా ముందుకొచ్చి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని సీఈసీ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పన, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇన్ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల ఉదాసీనతపై రూపొందించిన ఓ బుక్లెట్ను కూడా విడుదల చేశారు. లాజిస్టికల్ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, ఓటర్లలో అవగాహనను పెంచేందుకు ఉద్దేశించిన ‘సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్- ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP)’ ప్రోగ్రామ్ తదితర అంశాలపై చర్చలు జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.