Arvind Kejriwal: లాకప్లో కంప్యూటర్, పేపర్ ఇవ్వలేదు.. కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారు..!
తమ కస్టడీ నుంచి దిల్లీ సీఎం ఆదేశాలు జారీ చేశారంటూ ఆప్ చెప్పడాన్ని ఈడీ తీవ్రంగా తీసుకొంది. మంత్రి ఆతిశీని ప్రశ్నించడంతో సహా కేజ్రీవాల్ కదలికలను పరిశీలించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా వెలికి తీయనుంది.
ఇంటర్నెట్డెస్క్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదేశాలు జారీ చేశారంటూ దిల్లీ మంత్రి ఆతిశీ మార్లీనా నిన్న విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్ మంత్రి ఆతిశీ మార్లీనాను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్ కదిలికలను గమనించేందుకు సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని చెబుతున్నారు.
భాజపా కేజ్రీవాల్కు భయపడుతోంది..: సంజయ్ రౌత్
కేజ్రీవాల్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. రామ్లీలా మైదానంలో ఆప్ తలపెట్టిన భారీ ర్యాలీకి హాజరవుతామని ఆయన వెల్లడించారు. జైలు నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో భాజపాకు కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా తయారయ్యారని పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చెప్పేది వినటమే కాదు.. మద్దతుగా తరలివస్తారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు బలంగా తిరిగి వచ్చారన్నారు.
మరోవైపు రామ్లీలా మైదానంలో 1.5లక్షల మందితో భారీ సభను ఏర్పాటు చేయడానికి ఆమ్ఆద్మీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. దీనిపై పార్టీ కార్యదర్శి సందీప్ పాఠక్ నాయకులకు మార్గదర్శకాలను జారీ చేశారు. మార్చి 27,28న ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో కలిపి జోనల్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి బూత్ నుంచి 10 మంది మార్చి 31వ తేదీన రామ్లీలా మైదానం చేరుకొనేలా చూడాలన్నారు. దిల్లీలోని 14,000 బూత్ల నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని పాఠక్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్