Swati maliwal: నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్‌

ఆప్‌ నేతలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన సొంత వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతీ మాలీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 21 May 2024 13:28 IST

దిల్లీ: ఆప్‌ (APP) నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారని ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati maliwal) ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్‌ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్‌ చేయడాన్ని ప్రశ్నించారు.

ఎక్స్ వేదికగా మాట్లాడుతూ‘‘నేను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని  దిల్లీ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. భాజపా సూచనల మేరకే చేశానని పుకార్లు సృష్టిస్తున్నారు. 2016లో నా మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్దంగా పోరాటం చేశాను. కోర్టు అది తప్పుడు కేసని కొట్టేసింది. ఆ సమయంలో ఆప్‌ నేతలు నన్ను లేడీ సింగం అని పొగిడారు. వారికి నేనిప్పుడు భాజపా ఏజెంట్‌గా కనిపిస్తున్నానా?’’ అని ఆప్‌ వర్గాలను నిలదీశారు. దిల్లీ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. వారు చెప్పే ప్రతి అబద్ధానికి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు  పార్టీ మొత్తం తనపై ట్రోల్‌ చేస్తోందన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపమని చెబుతూ, వాటిని లీక్‌ చేస్తున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని