UP: కుమారుడి మృతదేహంతో ఆసుపత్రిలో నిరసనకు దిగిన మాజీ ఎంపీ
తన కుమారుడి మృతికి కారణమైన డాక్టర్ను విధుల్లోంచి తొలగించాలని లఖ్నవూలోని ఎస్జీపీజీఐ ఆసుపత్రిలో భాజపాకు చెందిన మాజీ ఎంపీ నేలపై కూర్చొని ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ఎదుట నిరసనకు దిగారు.
దిల్లీ: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు ఖాళీ లేక భాజపాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు తన కుమారుడిని కోల్పోయారు. దీంతో ఆయన తన కుమారుడి మృతదేహంతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఎదుట నేలపై కూర్చొని నిరసనకు దిగిన ఘటన చర్చనీయాంశమైంది. తన కుమారుడు మృతి చెందడానికి కారణమైన డాక్టర్ను విధుల్లోంచి తొలగించాలని ఆయన పట్టుబట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో చోటుచేసుకుంది. మాజీ ఎంపీ భైరాన్ ప్రసాద్ మిశ్రా తన కుమారుడు ప్రకాశ్ మిశ్రా(41)కు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో లఖ్నవూలోని ఎస్జీపీజీఐ ఆసుపత్రికి ఆదివారం రాత్రి 11 గంటలకు తీసుకొచ్చారు. అయితే కొన్ని గంటలకే ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు.
దీంతో సదరు మాజీ ఎంపీ తన కుమారుడి మృతదేహంతో ఆసుపత్రి వార్డులో నేలపై కూర్చొని నిరసనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు ఖాళీగా లేవని, ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యుడు ఎలాంటి సహాయం చేయలేదని ఆయన ఆరోపణలు చేశారు. ‘‘నేను నా కుమారుడిని కోల్పోయాను. నా కుమారుడి మృతి తర్వాత దాదాపు 20-25 మందికి చికిత్స చేశారు. నేను నిరసనకు దిగడంతో సదరు డాక్టర్ను తొలగించాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. నా కుమారుడు మృతి చెందడానికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి’’ అని మాజీ ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఆసుపత్రి చీఫ్ ఆర్కే ధీమన్ వివరణ ఇచ్చారు. ‘‘ఎంపీ కుమారుడిని ఇంటెన్సివ్ కేర్ యునిట్(ఐసీయూ)లో చేర్చమని విధుల్లో ఉన్న డాక్టర్ చెప్పారు. అయితే అక్కడ బెడ్లు ఖాళీగా లేవు. అయినా సదరు వైద్యుడు అలా ఎందుకు చెప్పాడో తెలియదు. మేము ఒక కమిటీని ఏర్పాటు చేశాము. దాని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం డాక్టర్ను విధుల్లోంచి తొలగించాం’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో అధికార భాజపా ప్రభుత్వంపై సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఆసుపత్రి తప్పిదం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్పిదమని అన్నారు. ఆసుపత్రులకు ప్రభుత్వం ఎందుకు నిధులు సమకూర్చడం లేదని ప్రశ్నించారు. మరోవైపు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ప్రభుత్వం ఈ ఘటన పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదొక దురదృష్టకర సంఘటన అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్